Indo-Pak Border: సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం.. మిస్టరీగా డెత్!
- భారత్-పాకిస్థాన్ సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం
- పాకిస్థాన్ జాతీయులుగా గుర్తింపు.. అధికారుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. రాజస్థా్న్లోని జైసల్మేర్లోని ఇండో-పాక్ సరిహద్దులో కుళ్లిపోయి ఉన్న రెండు మృతదేహాలను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకుంది. సంఘటనాస్థలి నుంచి ఖాళీ వాటర్ బాటిల్, ఐడీలు, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఐడీకార్డులను బట్టి పాకిస్థాన్ జాతీయులుగా అధికారులు గుర్తించారు. భారత్ నుంచి పాకిస్థాన్కు వెళ్తున్నారా? లేదంటే పాకిస్థాన్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తు్న్నారా? అనేది ఇంకా తేలలేదు. తాజాగా వర్షాలు కురవడంతో పాదముద్రలు గానీ.. ఆనవాళ్లు గానీ ఏమీ కనిపించలేదు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Patancheru : పాశమైలారం పేలుడు ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య
Also Read
- Bihar Bankipur Bypoll Result: నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు.. బంకిపూర్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
- Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… భారత భూభాగంలో మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పాకిస్థాన్ సిమ్ కార్డు, ఐడీలు, మొబైల్ ఫోన్, వాటర్ బాటిల్ సంఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్ కారణంగానే ఇద్దరూ చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారనేది తేలాల్సి ఉందని చెప్పారు. ఇద్దరు మృతదేహాలు కూడా కుళ్లిపోయి ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
భారత భూభాగం నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు డెడ్బాడీలు కనిపించాయని.. ఐడీ కార్డులను బట్టి మృతులు రవి కుమార్(17), శాంతి బాయి(15)గా గుర్తించినట్లు జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి వెల్లడించారు. 2023లో జారీ చేయబడిన ఐడీ కార్డులు అని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. ఆధారాలు నిర్ధారించేందుకు ప్రయత్నిస్తు్న్నట్లు పేర్కొన్నారు. వారం క్రితం చనిపోయి ఉంటారని అంచనా వేశారు. మృతదేహాలను రామ్గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీకి పంపారు. పోస్ట్మార్టం పరీక్ష తర్వాత మరణానికి కారణాన్ని నిర్ధారించనున్నారు.
#WATCH | Jaisalmer, Rajasthan | On dead bodies of Pakistani nationals found near India-Pakistan border, SP Sudhir Chaudhary says, "Around 11 AM yesterday, a local resident reported that the body of a young woman had been found a few kilometres from the international… pic.twitter.com/tYQ3ZOonIy
— ANI (@ANI) June 29, 2025
తాజావార్తలు
-
Top 5 Indian Bowlers: టాప్-5 భారత బౌలర్లు.. జస్ప్రీత్ బుమ్రాకు చోటే లేదు.. నంబర్-1 ఎవరంటే?
-
Alias Rukmini : నాని నిర్మాతగా నితిన్ హీరోగా ‘రుక్మిణీ’ గ్లిమ్స్ రిలీజ్
-
Bihar Bankipur Bypoll Result: నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు.. బంకిపూర్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
-
Dhanush: రాజకీయాలపై ఊహాగానాల వేళ.. కుమారులతో ధనుష్ ప్రత్యేక పూజలు.. అసలేం జరుగుతోంది?
-
Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!