Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
- ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్
- ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల్లో కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన
- మెటాకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలలపై లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల్లో కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బాలల లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపులను ప్రోత్సహించే లేదా అలాంటి కార్యకలాపాలకు అవకాశం కల్పించే అన్ని రకాల ప్రకటనలు, కంటెంట్ను ఇన్స్టాగ్రామ్ నుంచి తక్షణమే తొలగించాలని మెటాను ఆదేశించింది.
ఏ కారణంతో నోటీసు?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇన్స్టాగ్రామ్లోని కొన్ని చెల్లింపు ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన అనుచిత కంటెంట్ కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన MeitY, వెంటనే చర్యలు తీసుకోవాలని మెటాకు స్పష్టం చేసింది.
Also Read
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం
ఈ నోటీసుకు సంబంధించి ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెటాను ఆదేశించింది. అలాగే, అభ్యంతరకరమైన కంటెంట్ను పూర్తిగా తొలగించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై వివరాలు సమర్పించాలని సూచించింది.
చట్టపరమైన చర్యలకు హెచ్చరిక
ఒకవేళ నిర్ణీత గడువులోగా మెటా స్పందించకపోతే లేదా తగిన చర్యలు తీసుకోకపోతే, సమాచార సాంకేతిక (IT) చట్టంతో పాటు పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో (POCSO) చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రభుత్వ నిఘా
ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్లలో అక్రమ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇటీవలే పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ను చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్న అంశంపై టెలిగ్రామ్ కు నోటీసు జారీ చేసింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాలల భద్రతకు విఘాతం కలిగించే కంటెంట్పై చర్యలు తీసుకోవాలని మెటాకు ఆదేశించడం ద్వారా, సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్పై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!