Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
- ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్
- ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల్లో కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన
- మెటాకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలలపై లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల్లో కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బాలల లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపులను ప్రోత్సహించే లేదా అలాంటి కార్యకలాపాలకు అవకాశం కల్పించే అన్ని రకాల ప్రకటనలు, కంటెంట్ను ఇన్స్టాగ్రామ్ నుంచి తక్షణమే తొలగించాలని మెటాను ఆదేశించింది.
ఏ కారణంతో నోటీసు?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇన్స్టాగ్రామ్లోని కొన్ని చెల్లింపు ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన అనుచిత కంటెంట్ కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన MeitY, వెంటనే చర్యలు తీసుకోవాలని మెటాకు స్పష్టం చేసింది.
Also Read
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- 1984 Anti-Sikh Riots: "సజ్జన్ కుమార్ హీరోనా.?" రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
- New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం
ఈ నోటీసుకు సంబంధించి ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెటాను ఆదేశించింది. అలాగే, అభ్యంతరకరమైన కంటెంట్ను పూర్తిగా తొలగించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై వివరాలు సమర్పించాలని సూచించింది.
చట్టపరమైన చర్యలకు హెచ్చరిక
ఒకవేళ నిర్ణీత గడువులోగా మెటా స్పందించకపోతే లేదా తగిన చర్యలు తీసుకోకపోతే, సమాచార సాంకేతిక (IT) చట్టంతో పాటు పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో (POCSO) చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రభుత్వ నిఘా
ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్లలో అక్రమ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇటీవలే పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ను చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్న అంశంపై టెలిగ్రామ్ కు నోటీసు జారీ చేసింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాలల భద్రతకు విఘాతం కలిగించే కంటెంట్పై చర్యలు తీసుకోవాలని మెటాకు ఆదేశించడం ద్వారా, సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్పై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!