PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- ప్రధాని మోదీని కలిసిన ఆయన పాఠశాల స్నేహితుడు అస్గర్ అలీ వోహ్రా
- పాత భూ వివాదంపై సీబీఐ విచారణ జరపాలని ప్రధానిని కోరినట్లు సమాచారం
- బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన కంపెనీలపై ప్రధానికి ఫిర్యాదు
- సుమోటోగా స్వీకరించిన మున్సిపల్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఆయన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ వోహ్రా ఇటీవల కలిశారు. తనకు సంబంధించిన పాత భూ వివాదంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రధానిని కోరినట్లు సమాచారం. ఈమేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ కూడా అందించారు. 81 ఏళ్ల అస్గల్ అలీ గుజరాత్ వడ్నగర్లో బీఎన్ స్కూల్లో మోడీతో కలిసి చదువుకున్నారు. సెప్టెంబర్ 8, 2026న ఆయన ప్రధానిని కలిశారు.
మహారాష్ట్రంలోని భయందర్, నవ్ఘర్ రోడ్ ప్రాంతంలో ఉన్న 2810 చదరపు మీటర్ల భూమికి సంబంధించిన వివాదంపై అస్గర్ అలీ ప్రధానిని కలిశారు. 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా తాను ఈ భూమిని కొనుగోలు చేసినట్లు వోహ్రా తన లేఖలో పేర్కొన్నారు. తాను ఆ భూమిని ఎవరికీ విక్రయించలేదని, మరెవరికి బదిలీ చేయలేదని ఆయన చెప్పారు. 2011లో తన భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారని, ఇందులో ‘‘స్వయం బిల్డర్స్’’ కుమ్మకయ్యారని ఆరోపించారు.
Also Read
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందినవిగా పేర్కొన్న ‘సెవెన్ ఎలెవెన్ కన్స్ట్రక్షన్స్’, ‘స్వయం బిల్డర్స్’ సంస్థలపై వోహ్రా ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా భూమిని రెండు భాగాలుగా విభజించినట్లు ఆయన పేర్కొన్నారు. భూమిని రెండు బిల్డర్స్ సంస్థలు ఆక్రమించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో 2015లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు దర్యాప్తు సుమారు 11 ఏళ్ల తర్వాత 2026లో సీఐడీ నివేదిక ఇచ్చిందని అస్గర్ లేఖలో ఆరోపించారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
అస్గర్ ప్రధానిని కలిసిన తర్వాత, స్థానిక మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారు. ఈ కేసు ఇప్పుడు 2026 సెప్టెంబర్ 16న విచారణకు రానుంది. ఈ విచారణఖు హాజరు కావాలని రెండు కంపెనీలను అధికారులు ఆదేశించారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!