Mehbooba Mufti: కాశ్మీర్ విధానం ఫెయిల్.. ఢిల్లీ పేలుడుపై కేంద్ర వైఖరిపై మెహబూబా ముఫ్తీ సెటైర్లు
- జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర విధానం విఫలమైంది..
- కాశ్మీర్ ప్రజలు గౌరవంగా, భయం లేకుండా జీవించేలా కేంద్రం చర్యలు తీసుకోలేదు..
- జమ్ము కాశ్మీర్ ప్రజలపై దర్యాప్తు సంస్థలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి: మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానం పూర్తిగా విఫలమైందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొనింది. ప్రజలు గౌరవంతో, భయంలేకుండా జీవించేందుకు కేంద్రం చేపట్టాల్సిన చర్యలను ఇప్పటి వరకు తీసుకోలేదని అన్నారు. అలాగే, ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక డాక్టర్ ఆత్మాహుతి బాంబర్గా మారి అమాయకుల ప్రాణాలు తీసిన విషయం బాధాకరం అన్నారు. కాశ్మీర్ యువత ఎప్పుడూ అలాంటి దారిలో నడవకూడదని ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.
Read Also: Salman Khan: బిగ్బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ భావోద్వేగం.. ఆ వీడియో చూసి కన్నీటిపర్యంతం..
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
అయితే, ఒక చదువుకున్న యువకుడు ఆత్మాహుతి దాడికి దిగడం చాలా దురదృష్టం.. దీనిని ఆపాల్సిందేనని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు దేశంలో శాంతి ఏర్పాడలంటే చర్చలు, సంసమతుల్య విధానమే సరైన మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను నిరంతరం ఒత్తిడికి గురి చేయడం, కట్టడి చేయడం ద్వారా శాంతి సాధ్యం కాదని సూచించారు. 2019 తరువాత కాశ్మీర్ లో అమలులో చేస్తున్న విధానాలు ఫలించలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రధాన మంత్రి, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అంగీకరించాల్సిన అవసరం పీడీపీ చీఫ్ ముఫ్తీ ఉందన్నారు.
Read Also: Rana Daggubati: బెట్టింగ్ యాప్ వివాదంపై.. మొదటి సారిగా స్పందించి రానా ..
ఇక, జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వారి ఆవేదనను, ఆందోళనలను వినాలని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారు.. వారికి సరైన గౌరవం, భద్రత కావాలి అని కోరింది. UAPA, PSA వంటి కఠిన చట్టాలు, NIAతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు ప్రజలను ఒత్తిడికి గురి చేయొద్దని సూచించింది.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!