Mehbooba Mufti: కాశ్మీర్ విధానం ఫెయిల్.. ఢిల్లీ పేలుడుపై కేంద్ర వైఖరిపై మెహబూబా ముఫ్తీ సెటైర్లు
- జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర విధానం విఫలమైంది..
- కాశ్మీర్ ప్రజలు గౌరవంగా, భయం లేకుండా జీవించేలా కేంద్రం చర్యలు తీసుకోలేదు..
- జమ్ము కాశ్మీర్ ప్రజలపై దర్యాప్తు సంస్థలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి: మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానం పూర్తిగా విఫలమైందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొనింది. ప్రజలు గౌరవంతో, భయంలేకుండా జీవించేందుకు కేంద్రం చేపట్టాల్సిన చర్యలను ఇప్పటి వరకు తీసుకోలేదని అన్నారు. అలాగే, ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక డాక్టర్ ఆత్మాహుతి బాంబర్గా మారి అమాయకుల ప్రాణాలు తీసిన విషయం బాధాకరం అన్నారు. కాశ్మీర్ యువత ఎప్పుడూ అలాంటి దారిలో నడవకూడదని ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.
Read Also: Salman Khan: బిగ్బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ భావోద్వేగం.. ఆ వీడియో చూసి కన్నీటిపర్యంతం..
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
అయితే, ఒక చదువుకున్న యువకుడు ఆత్మాహుతి దాడికి దిగడం చాలా దురదృష్టం.. దీనిని ఆపాల్సిందేనని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు దేశంలో శాంతి ఏర్పాడలంటే చర్చలు, సంసమతుల్య విధానమే సరైన మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను నిరంతరం ఒత్తిడికి గురి చేయడం, కట్టడి చేయడం ద్వారా శాంతి సాధ్యం కాదని సూచించారు. 2019 తరువాత కాశ్మీర్ లో అమలులో చేస్తున్న విధానాలు ఫలించలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రధాన మంత్రి, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అంగీకరించాల్సిన అవసరం పీడీపీ చీఫ్ ముఫ్తీ ఉందన్నారు.
Read Also: Rana Daggubati: బెట్టింగ్ యాప్ వివాదంపై.. మొదటి సారిగా స్పందించి రానా ..
ఇక, జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వారి ఆవేదనను, ఆందోళనలను వినాలని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారు.. వారికి సరైన గౌరవం, భద్రత కావాలి అని కోరింది. UAPA, PSA వంటి కఠిన చట్టాలు, NIAతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు ప్రజలను ఒత్తిడికి గురి చేయొద్దని సూచించింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!