Mehbooba Mufti: కాశ్మీర్ విధానం ఫెయిల్.. ఢిల్లీ పేలుడుపై కేంద్ర వైఖరిపై మెహబూబా ముఫ్తీ సెటైర్లు
- జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర విధానం విఫలమైంది..
- కాశ్మీర్ ప్రజలు గౌరవంగా, భయం లేకుండా జీవించేలా కేంద్రం చర్యలు తీసుకోలేదు..
- జమ్ము కాశ్మీర్ ప్రజలపై దర్యాప్తు సంస్థలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి: మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానం పూర్తిగా విఫలమైందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొనింది. ప్రజలు గౌరవంతో, భయంలేకుండా జీవించేందుకు కేంద్రం చేపట్టాల్సిన చర్యలను ఇప్పటి వరకు తీసుకోలేదని అన్నారు. అలాగే, ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక డాక్టర్ ఆత్మాహుతి బాంబర్గా మారి అమాయకుల ప్రాణాలు తీసిన విషయం బాధాకరం అన్నారు. కాశ్మీర్ యువత ఎప్పుడూ అలాంటి దారిలో నడవకూడదని ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.
Read Also: Salman Khan: బిగ్బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ భావోద్వేగం.. ఆ వీడియో చూసి కన్నీటిపర్యంతం..
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అయితే, ఒక చదువుకున్న యువకుడు ఆత్మాహుతి దాడికి దిగడం చాలా దురదృష్టం.. దీనిని ఆపాల్సిందేనని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు దేశంలో శాంతి ఏర్పాడలంటే చర్చలు, సంసమతుల్య విధానమే సరైన మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను నిరంతరం ఒత్తిడికి గురి చేయడం, కట్టడి చేయడం ద్వారా శాంతి సాధ్యం కాదని సూచించారు. 2019 తరువాత కాశ్మీర్ లో అమలులో చేస్తున్న విధానాలు ఫలించలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రధాన మంత్రి, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అంగీకరించాల్సిన అవసరం పీడీపీ చీఫ్ ముఫ్తీ ఉందన్నారు.
Read Also: Rana Daggubati: బెట్టింగ్ యాప్ వివాదంపై.. మొదటి సారిగా స్పందించి రానా ..
ఇక, జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వారి ఆవేదనను, ఆందోళనలను వినాలని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారు.. వారికి సరైన గౌరవం, భద్రత కావాలి అని కోరింది. UAPA, PSA వంటి కఠిన చట్టాలు, NIAతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు ప్రజలను ఒత్తిడికి గురి చేయొద్దని సూచించింది.
తాజావార్తలు
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!