Mehbooba Mufti: ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని ‘‘వేధించవద్దు’’.. ఉగ్రవాదులకు ముఫ్తీ మద్దతు ఇస్తుందా.?
- ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని వేధించవద్దు..
- ఉగ్రవాదంపై మెహబూబా ముఫ్తీ సున్నిత వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు డాక్టర్లుగా ఉంటూనే ఉగ్రవాదానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ల తల్లిదండ్రుల్ని విచారణ పేరుతో ‘‘వేధించవద్దు’’ అని అన్నారు.
గతంలో కూడా ముఫ్తీ ఇలా నిందితులకు మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఆమె ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విమర్శిస్తూ మాట్లాడారు. పాకిస్తాన్తో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సైనిక కేంద్రీకృత విధానాన్ని విడిచిపెట్టాలని కోరారు. తాజాగా, మరోసారి ఢిల్లీ ఉగ్రదాడిపై కూడా ఇలాగే తన సున్నిత వైఖరిని చూపించారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Hyderabad: రెడ్ లైట్ ఏరియాగా మారిన శ్రీశైలం హైవే? పట్టించుకోని పోలీసులు..!
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందిస్తూ.. మృతులకు సంతాపాన్ని వ్యక్తి చేశారు. దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితులు దోషులుగా తేలితే తప్పా వారిపై దుర్భాషలాడకూడదని, ఇది వారి కుటుంబాలను బాధపెడుతుందని ఆమె అన్నారు. శ్రీనగర్ విలేకరుల సమావేశంలో బుధవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై న్యాయపరమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
‘‘ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లను నేను ఖండిస్తున్నాను. మన విద్యావంతులైన వైద్యులు బాధపడుతున్నారు. ఢిల్లీ పేలుడుపై పూర్తి , న్యాయమైన దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ దాడిలో వైద్యులు ప్రమేయం ఉంటే, అది మనందరికీ చాలా హానికరం. అరెస్టయిన డాక్టర్ల తల్లిదండ్రుల్ని వేధించవద్దు. వారి ప్రమేయం లేదు. ఘటనలో పాల్గొన్న వారిని శిక్షించాలి. కానీ అమాయకులనను వేధించవద్దు’’ అని ముఫ్తీ అన్నారు.
మరోవైపు, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా భద్రతా , దర్యాప్తు సంస్థల నుండి అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీసులు NIA, NSG, IB , స్థానిక పోలీసులతో కలిసి 500 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో సోదాలను ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?