Ram Mandir: రామ మందిర వేడుక.. ఆ దేశంలో అధికారులకు 2 గంటల ప్రత్యేక విరామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం భారతదేశం ముస్తాబవుతోంది. ముఖ్యంగా అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
ఇదిలా ఉంటే హిందూ జనాభా, భారతీయ మూలాలు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశ ప్రభుత్వం రామాలయ వేడుక నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ సమాజం నుంచి వచ్చిన అభ్యర్థన మేరరు మారిషన్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ నేతృత్వంలోని మంత్రుల మండలి శుక్రవారం సమావేశమైంది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజల అభ్యర్థనపై సానుకూల నిర్ణయం తీసుకుంది. వేడుకల్లో పాల్గొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read
Read Also:Hanuman: చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్న హనుమాన్ టీమ్.. అయోధ్య రామ మందిరానికి విరాళం
జనవరి 22, 2024న అధికారులకు రెండు గంటల విరామం ఇవ్వాలని హిందూ సామాజిక-సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్ ప్రభుత్వం ఆమోదించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు అధికారులకు విరామం ఇవ్వనుంది. 2011 గణాంకాల ప్రకారం, హిందూ మతం మారిషస్ ప్రధాన మతంగా ఉంది. అక్కడ 48.5 శాతం మంది హిందు మతాన్ని అనుసరిస్తున్నారు. నేపాల్ తర్వాత హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మారిషన్ మూడో స్థానంలో ఉంది.
బ్రిటీష్ కాలంలో భారత్ నుంచి చాలా మందిని మారిషస్లో ఫ్రెంచ్, బ్రిటీష్ వారి తోటల్లో పనిచేయించుకునేందుకు తీసుకెళ్లారు. కాలక్రమేణా వారు అక్కడే స్థిరపడిపోయారు. ఎక్కువగా ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి భారతీయ రాష్ట్రాల నుండి మారిషస్ వెళ్లారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!