Ram Mandir: రామ మందిర వేడుక.. ఆ దేశంలో అధికారులకు 2 గంటల ప్రత్యేక విరామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం భారతదేశం ముస్తాబవుతోంది. ముఖ్యంగా అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
ఇదిలా ఉంటే హిందూ జనాభా, భారతీయ మూలాలు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశ ప్రభుత్వం రామాలయ వేడుక నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ సమాజం నుంచి వచ్చిన అభ్యర్థన మేరరు మారిషన్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ నేతృత్వంలోని మంత్రుల మండలి శుక్రవారం సమావేశమైంది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజల అభ్యర్థనపై సానుకూల నిర్ణయం తీసుకుంది. వేడుకల్లో పాల్గొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also:Hanuman: చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్న హనుమాన్ టీమ్.. అయోధ్య రామ మందిరానికి విరాళం
జనవరి 22, 2024న అధికారులకు రెండు గంటల విరామం ఇవ్వాలని హిందూ సామాజిక-సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్ ప్రభుత్వం ఆమోదించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు అధికారులకు విరామం ఇవ్వనుంది. 2011 గణాంకాల ప్రకారం, హిందూ మతం మారిషస్ ప్రధాన మతంగా ఉంది. అక్కడ 48.5 శాతం మంది హిందు మతాన్ని అనుసరిస్తున్నారు. నేపాల్ తర్వాత హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మారిషన్ మూడో స్థానంలో ఉంది.
బ్రిటీష్ కాలంలో భారత్ నుంచి చాలా మందిని మారిషస్లో ఫ్రెంచ్, బ్రిటీష్ వారి తోటల్లో పనిచేయించుకునేందుకు తీసుకెళ్లారు. కాలక్రమేణా వారు అక్కడే స్థిరపడిపోయారు. ఎక్కువగా ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి భారతీయ రాష్ట్రాల నుండి మారిషస్ వెళ్లారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!