Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం భారతదేశం ముస్తాబవుతోంది. ముఖ్యంగా అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.