Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..
- రాజకీయ దోషుల జీవిత కాల నిషేధంపై కేంద్ర సంచలన నిర్ణయం..
- ఇది పార్లమెంట్ పరిధిలోని అంశమని సుప్రీంకోర్టుకు స్పష్టం..
- ఇప్పుడున్న 6 ఏళ్ల నిషేధం సరిపోతుందని తెలిపిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre To Supreme: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిని రాజకీయ నాయకులపై జీవిత కాలం నిషేధం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న 6 ఏళ్లు సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని, దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో తన నిర్ణయాన్ని పేర్కొంది. ప్రజాప్రతినిధుల అనర్హత వ్యవధిని నిర్ణయించడం పూర్తిగా ‘‘పార్లమెంట్’’ పరిధిలోనిదని కేంద్రం పేర్కొంది.
‘‘జీవిత కాలం నిషేధం సముచితామా..? కాదా..? అనేది పార్లమెంట్ పరిధిలోని ప్రశ్న’’ అని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. అనర్హత పదాన్ని దమాషా మరియు సహేతుక సూత్రాలను పరిగణలోకి తీసుకుని చట్టసభలు నిర్ణయిస్తాయని చెప్పింది. . 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 మరియు 9 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా తన నిర్ణయాన్ని కేంద్రం ఈ రోజు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: AP Crime: భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి
సెక్షన్ 08 ప్రకారం, నిర్దిష్ట నేరాలకు పాల్పడిన వ్యక్తి జైలు శిక్ష పూర్తయిన తర్వాత 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత ఎదుర్కుంటారు. అయితే, ఈ నిషేధాన్ని జీవితకాలానికి పొడగించాలని పిటిషన్ వాదించారు. సెక్షన్ 9 ప్రకారం, అవినీతి లేదా రాజ్యం పట్ల అవిశ్వాసం కారణంగా తొలగించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తొలగింపు తేదీ నుండి ఐదు సంవత్సరాల పాటు అనర్హులుగా ప్రకటించబడతారు. రెండు సందర్భాలలోనూ అనర్హత జీవితాంతం ఉండాలని ఉపాధ్యాయ అన్నారు.
రాజ్యాంగం అనర్హతలను నియంత్రించే మరిన్ని చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్కి అవకాశం కల్పించిందని, అనర్హత కారణాలు, అనర్హత వ్యవధిని నిర్ణయించే అధికారం పార్లమెంట్కి ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191ని కేంద్ర ఉదహరించింది. ఇది లోక్సభ, రాజ్యసభ, శాసనసభలు లేదా శాసనమండలి సభ్యత్వానికి అనర్హతలను పరిష్కరిస్తుంది.
కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలను మూడు నెలల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండానే సభ నుండి వెంటనే అనర్హులుగా ప్రకటిస్తామని సుప్రీంకోర్టు 2013 ఏప్రిల్లో తీర్పు ఇచ్చింది, అప్పటి వరకు అలాగే కొనసాగింది. అయితే, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిని నిరోధించడానికి ఆర్డినెన్స్ని తీసుకువచ్చింది. అయితే, ఆ సమయంలో రాహుల్ గాంధీ ఈ ఆర్డినెన్స్ని బహిరంగంగా చించేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!