Krishna Janmabhoomi Case: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసులో కీలక తీర్పు.. మసీదును సర్వే చేయాలని ఆదేశాలు
Mathura Court Orders Survey Of Shahi Idgah Mosque After January 2: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు చెప్పింది. జనవరి 2 తర్వాత వివాదాస్పద షాహీ ఈద్గా ప్రాంతంలో భారత పురావస్తు శాఖ సర్వే చేయాలని శనివారం తీర్పును వెలువరించింది. జనవరి 20 తర్వాత నివేదిక సమర్పించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. గతంలో జ్ఞాన్వాపి మసీదులో సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోంది. హిందు సంస్థల తరుపున విష్ణు గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుల తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా మసీదును కత్రా కేశవ్ దేవ్ ఆలయం నుంచి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మసీదు శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో నిర్మించారని హిందు సంఘాలు పేర్కొంటున్నాయి. 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు శ్రీకృష్ణుడి ఆలయంలోని 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మించారని హిందూసంఘాలు చెబుతున్నాయి. దీంతో ఈ వివాదాస్పద స్థలంపై విష్ణుగుప్తా పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
Read Also: Union Health Minister: ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి
విష్ణు గుప్తా తరపు న్యాయవాది శైలేష్ దూబే మాట్లాడుతూ.. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జీత్ సింగ్ యాదవ్ డిసెంబర్8న కోర్టులో తన వాదనలు వినిపించారని.. శ్రీకృష్ణుని జననం నుండి ఆలయ నిర్మాణం వరకు మొత్తం చరిత్రను ఆయన కోర్టు ముందుంచారని.. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దు చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞాన్వాపి అంశం కోర్టులో ఉంది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలతో జ్ఞాన్వాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. ఈ సర్వేలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం బయటపడింది. దీంతో పాటు మసీదు వెలుపల కొన్ని హిందూ దేవీదేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నట్లు వీడియోగ్రఫీలో తేలింది. తాజాగా షాహీఈద్గా మసీదులో విషయంలో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!