Krishna Janmabhoomi Case: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసులో కీలక తీర్పు.. మసీదును సర్వే చేయాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mathura Court Orders Survey Of Shahi Idgah Mosque After January 2: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు చెప్పింది. జనవరి 2 తర్వాత వివాదాస్పద షాహీ ఈద్గా ప్రాంతంలో భారత పురావస్తు శాఖ సర్వే చేయాలని శనివారం తీర్పును వెలువరించింది. జనవరి 20 తర్వాత నివేదిక సమర్పించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. గతంలో జ్ఞాన్వాపి మసీదులో సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోంది. హిందు సంస్థల తరుపున విష్ణు గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుల తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా మసీదును కత్రా కేశవ్ దేవ్ ఆలయం నుంచి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మసీదు శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో నిర్మించారని హిందు సంఘాలు పేర్కొంటున్నాయి. 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు శ్రీకృష్ణుడి ఆలయంలోని 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మించారని హిందూసంఘాలు చెబుతున్నాయి. దీంతో ఈ వివాదాస్పద స్థలంపై విష్ణుగుప్తా పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Union Health Minister: ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి
విష్ణు గుప్తా తరపు న్యాయవాది శైలేష్ దూబే మాట్లాడుతూ.. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జీత్ సింగ్ యాదవ్ డిసెంబర్8న కోర్టులో తన వాదనలు వినిపించారని.. శ్రీకృష్ణుని జననం నుండి ఆలయ నిర్మాణం వరకు మొత్తం చరిత్రను ఆయన కోర్టు ముందుంచారని.. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దు చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞాన్వాపి అంశం కోర్టులో ఉంది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలతో జ్ఞాన్వాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. ఈ సర్వేలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం బయటపడింది. దీంతో పాటు మసీదు వెలుపల కొన్ని హిందూ దేవీదేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నట్లు వీడియోగ్రఫీలో తేలింది. తాజాగా షాహీఈద్గా మసీదులో విషయంలో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!