Manipur: రాష్ట్రపతి పాలన మొదటి వారంలోనే.. మణిపూర్లో ఉగ్రవాదులపై భారీ దాడులు..
- రాష్ట్రపతి పాలన మొదటి వారంలోనే ఫుల్ పవర్స్..
- ఉగ్రవాదులపై భద్రతా బలగాల భారీ దాడులు..
Manipur: ఏడాదిన్నర కాలంగా మైయిటీ, కుకీల మధ్య జాతుల ఘర్షణలో అట్టుడికుతున్న మణిపూర్లో గత వారం రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సీఎం పదవిని ఎవరూ తీసుకోకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. అయితే, రాష్ట్రపతి పాలన విధించిన తొలి వారంలోనే భద్రతా బలగాలు అక్కడి ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపులపై భారీ అణిచివేత కార్యక్రమాలు చేపట్టారు. కేవలం వారంలోనే భద్రతా బలగాలు 30 మందికి పైగా రెబల్స్ని అరెస్ట్ చేశాయి. వీరిలో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అనేక మంత్రి గ్రామ వాలంటీర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంఫాల్ అంతటా అనేక ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి.
అరెస్టయిన ఉగ్రవాదులు కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), PREPAK, KYKL, అలాగే కుకి నేషనల్ ఆర్మీ (KNA), యునైటెడ్ నేషనల్ కుకి ఆర్మీ (UNKA) వంటి కుకి మిలిటెంట్ గ్రూపులతో సహా లోయలోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు చెందినవారు ఉన్నారు. మణిపూర్లోని వివిధ జిల్లాల్లో జరిగిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు కనీసం 15 ఐఈడీ బాంబులతో పాటు హెచ్కే రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, ఏకే సిరీస్ రైఫిల్స్తో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్లో కాక్చింగ్ జిల్లాలో 10 మందికి పైగా గ్రామ వాలంటీర్లను అరెస్ట్ చేశారు.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Read Also: Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది
రాష్ట్రపతి పాలన అమలులోకి రావడంతో మణిపూర్ బాధ్యతల్ని కేంద్రం నేరుగా తన చేతుల్లోకి తీసుకుంది. దీంతో పారామిలిటరీ దళాలను వేగంగా మోహరించడంతో పాటు నిఘా ఆధారిత తిరుగుబాటు నిరోధక చర్యలు సాధ్యమయ్యాయి. సాయుధ ఉగ్రవాదుల కదలికల్ని నిరోధించడానికి రహదారులు, కీలక మార్గాల్లో భద్రతా తనిఖీలు ప్రారంభించారు. రాత్రి వేళల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. దోపిడీ చేసిన, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నవారు 7 రోజుల్లో స్వచ్ఛందంగా లొంగిపోవాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా వార్నింగ్ ఇచ్చారు. దీని తర్వాత పెద్ద ఎత్తున ఆరెస్టులు జరిగాయి. గడువు ముగిసిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని గవర్నర్ హెచ్చరించారు. మరోవైపు అరెస్టులకు నిరసనగా ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను కూడా బలవంతంగా మూసివేయించారు.
మే 2023 నుంచి మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీల మధ్య సంఘర్షణ మొదలైంది. దీంతో మణిపూర్ అగ్నిగుండంగా మారింది. 220 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. హింస చెలరేగిన దాదాపుగా రెండేళ్ల తర్వాత ఫిబ్రవరి 09న మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించబడింది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!