Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- కేజ్రీవాల్ బాటలోనే మనీష్ సిసోడియా
- కోర్టులో మీరుంటే విచారణకు రాను
- జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారిస్తున్నారు. న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ గతంలో పలుమార్లు బీజేపీ అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. ఆమెతో న్యాయం జరుగుతుందని నమ్మకం కలగడం లేదని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ నుంచి ఆమెను తప్పించాలని పిటిషన్ వేయగా.. న్యాయస్థానం కొట్టేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ రాశారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. ‘‘జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న నా ఆశలు ఆవిరయ్యాయి. అందువల్ల నేను గాంధీజీ సత్యాగ్రహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నా మనస్సాక్షి ఆధారంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇస్తే.. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును నేను కలిగి ఉంటాను.’’ అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Also Read
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
తాజాగా కేజ్రీవాల్ బాటలోనే మనీష్ సిసోడియా వెళ్తున్నారు. తాను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఎదుట హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని.. మిగిలింది సత్యాగ్రహం మాత్రమేనని లేఖలో తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. అనూహ్యంగా ఈ కేసును గత ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. ఆమె ఆర్ఎస్ఎస్ సానుభూతిపరురాలని.. అలాగైతే ఈ కేసులో తమకు న్యాయం జరగదని.. విచారణ నుంచి తప్పించాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అయితే ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాబోనని తేల్చి చెబుతూ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లేఖ రాశారు.
"No lawyer will appear, no hope for justice, only Satyagraha left'': Manish Sisodia writes to Delhi HC
Read @ANI Story | https://t.co/LUlpy8ipkM#ManishSisodia #DelhiHC #excisepolicy pic.twitter.com/hkLkRxE6NS
— ANI Digital (@ani_digital) April 28, 2026
తాజావార్తలు
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!