Tejashwi Yadav: ఇది ‘‘మంగళ్ రాజ్’’ పాలన.. వంతెనలు కూలిపోవడంపై తేజస్వీ సెటైర్లు..
- బీహార్లో వరసగా కూలిపోతున్న వంతెనలు..
- నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు..
- మంగళ్రాజ్ ప్రభుత్వమని తేజస్వీ సెటైర్లు..
Tejashwi Yadav: బీహార్ రాష్ట్రంలో వరసగా వంతెనలు కూలిపోతున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలోని వివిధ ప్రాంతాల్లోని 5 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వంతెనల కూలిన ఘటనపై జేడీయూ-బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సుపరిపాలన అనేది అంతా వట్టిదే అని అన్నారు.
Read Also: Hyderabad: ఇంటి ముందు క్యాంప్ ఫైర్.. ప్రశ్నించిన వారిపై కాలుతున్న కట్టెలతో..
Also Read
తేజస్వీ యాదవ్ ఎక్స్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ‘‘అభినందనలు! బీహార్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క డబుల్ పవర్ కారణంగా, కేవలం 9 రోజుల్లో కేవలం 5 వంతెనలు కూలిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్గదర్శకత్వంలో 6 పార్టీలతో కూడిన డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం 9 రోజుల్లో 5 వంతెనలు కూలిపోవడంతో బీహార్ ప్రజలకు మంగళ్రాజ్ (మంచి పాలన) శుభాకాంక్షలను పంపింది’’ అని ట్వీట్ చేశారు.
నితీష్ కుమార్ ప్రభుత్వం ‘‘సుపరిపాలన విన్యాసాలు’’ అని ప్రతిపక్షంగా సెటైర్లతో విమర్శిస్తోంది. వంతెనలు కూలిపోవడం వల్ల వేలాది కోట్ల ప్రజాధనం నష్టపోయామని అన్నారు. మధుబని జిల్లా ఝంఝర్పూర్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడం, గడిచిన 11 రోజుల్లో ఐదవ ఘటన జరిగిన నేపథ్యంలో తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధుబని ఘటనతో పాటు గత 11 రోజుల్లో మరో నాలుగు వంతెనలు కూలిపోవడంతో నిర్మాణ ప్రమాణాలు, పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!