Maharashtra: సొంత కూతురితో సూసైడ్ నోట్ రాయించి హత్య.. ఓ తండ్రి దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Tricks Daughter To Write Suicide Note, Then Kills Her: కంటికి రెప్పటా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిని మోసం చేసి హత్య చేశాడు. తన బంధువులను ఇరికించేందుకు కూతురి మరణాన్ని వాడుకోవాలని చూశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 40 ఏళ్ల వ్యక్తి తన 16 ఏళ్ల కూతురు చేత సూసైడ్ నోట్ రాయించి, ఆత్మహత్య చేసుకునేలా నాటకం ఆడాలని సూచించాడు. అయితే తండ్రి మాటలను నమ్మిన ఆ బాలిక తండ్రి చెప్పినట్టే చేసింది. అయితే తండ్రి మాత్రం నిజంగానే అమ్మాయిని చంపేశారు. ఈ ఘటన నవంబర్ 6న నాగ్పూర్ నగరంలోని కలమ్నా ప్రాంతంలో జరిగింది.
Read Also: Tragedy In Love Marriage: ప్రేమ వివాహంలో విషాదం.. ఉదయం పెళ్లి, సాయంత్రం మృతి
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
ముందుగా గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా బాలిక సవతి తల్లి, మామ, అత్త, తాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణ సమయంలో మృతురాలి తండ్రి ఫోన్ పరిశీలించగా.. బాలిక ఆత్మహత్య చేసుకుంటుండగా తీసిన ఫోటోలు ఉన్నాయి. దీంతో బాలిక మరణం వెనక కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానించారు. మొబైల్ ఫోన్ పరిశీలించగా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఫోటోలు ఉన్నాయి. తన బంధువులను ఇరికించేందుకు కుమార్తెను ఉరివేసుకున్నట్లు నటించమని కోరాడు తండ్రి. స్టూల్ పై ఉండి ఉరి వేసుకున్నట్లు ఫోటోలకు ఫోజు ఇస్తున్న క్రమంలో తండ్రి స్టూల్ తన్నేశాడు. ఆ సమయంలో తండ్రితో పాటు 12 ఏళ్ల మరో కుమార్తె ఉన్నారు. వీరిద్దరి ముందే బాలిక చనిపోయింది.
ఈ ఘటన జరిగిన తర్వాత తండ్రి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చి తన కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అందర్ని నమ్మించారు. ముందుగా పోలీసులు కూడా బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఆ తరువాత కుట్ర కోణం బయటకు వచ్చింది. పోలీసులు నిందితుడి ఫోన్ చూసిన తర్వాత ప్రశ్నించగా.. అసలు నిజాన్ని వెల్లడించాడు. మొదటి భార్య 2016లో చనిపోయింది. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో భార్య తరుపు బంధువులను ఇరికించేందుకు సొంత కూతురినే చంపేశాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..