Bengaluru: డోర్ దగ్గర నిలబడ వద్దన్నందుకు కండక్టర్పై కత్తితో దాడి.. వీడియో వైరల్
- బెంగళూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు వీరంగం
- డోర్ దగ్గర నిలబడ వద్దన్నందుకు కండక్టర్పై కత్తితో దాడి
- వీడియో వైరల్.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టీసీ బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ఫుట్బోర్డు దగ్గర ఎవరూ నిలబడొద్దని కండక్టర్ హెచ్చరిస్తుంటాడు. బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని.. అలాగే ఫుట్బోర్డు ప్రమాదకరమని కండక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఈ మాటే ఒక వ్యక్తికి రుచించలేదు. కండక్టర్ ఆ మాట అన్నందుకు ఏకంగా హత్య చేసేందుకు రెడీ అయ్యాడు. అక్కడితో ఆగకుండా సహచర ప్రయాణికులపై బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Shiv Sena Reddy: క్రీడా ప్రేమికులకు గుడ్న్యూస్.. ప్రతి గ్రామంలో సీఎం కప్
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
జార్ఖండ్కు చెందిన హర్ష్ సిన్హా అనే వ్యక్తి బెంగళూరు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవుతుంంది. అయితే కండక్టర్ యోగేష్ ఫుట్బోర్డు మీద నిలబడొద్దని సూచించాడు. అంతే బ్యాగ్లోంచి కత్తి తీసి కండక్టర్ను పొడిచాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికులను కూడా బెదిరించాడు. ఈ దృశ్యాలు బస్సులో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయింది. యోగేష్ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) తెలిపింది.
ఇది కూడా చదవండి: AP Cabinet: ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
నిందితుడు హర్ష్ సిన్హాను బీపీవో సంస్థ తొలగించింది. మూడు వారాల నుంచి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడును అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. బస్సు ఎక్కే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కండక్టర్ ఫుట్ బోర్డు మీద నిలబడ వద్దన్నాడని చెప్పారు. ఇంతలో బ్యాగ్లోంచి కత్తి తీసి పొడిచాడని పోలీసులు వివరించారు.
ప్రయాణికులు అంతా కిందకు దిగేశారు. అనంతరం బస్సు డ్రైవర్ సిద్దలింగస్వామి డోర్ లాక్ చేసి బయటకు దూకగా హర్ష లోపల ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత బస్సులోంచి తప్పించుకునేందుకు అద్దాల తలుపులను తన్నడం, పగలగొట్టడం చేశాడు. నిందితుడు బస్సులో చిక్కుకోవడంతో డ్రైవర్, ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేసి నిందితుడిని పట్టించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
CCTV Footage Shows Bengaluru Man Stabbing Bus Conductor After Door Warning
A 25-year-old man was arrested in #Bengaluru for stabbing a #BMTC conductor after being asked to move away from the door. #cctv #bengalurucrime #knife pic.twitter.com/GccN6X66FW
— Madhuri Adnal (@madhuriadnal) October 2, 2024
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!