Bengaluru: డోర్ దగ్గర నిలబడ వద్దన్నందుకు కండక్టర్పై కత్తితో దాడి.. వీడియో వైరల్
- బెంగళూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు వీరంగం
- డోర్ దగ్గర నిలబడ వద్దన్నందుకు కండక్టర్పై కత్తితో దాడి
- వీడియో వైరల్.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టీసీ బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ఫుట్బోర్డు దగ్గర ఎవరూ నిలబడొద్దని కండక్టర్ హెచ్చరిస్తుంటాడు. బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని.. అలాగే ఫుట్బోర్డు ప్రమాదకరమని కండక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఈ మాటే ఒక వ్యక్తికి రుచించలేదు. కండక్టర్ ఆ మాట అన్నందుకు ఏకంగా హత్య చేసేందుకు రెడీ అయ్యాడు. అక్కడితో ఆగకుండా సహచర ప్రయాణికులపై బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Shiv Sena Reddy: క్రీడా ప్రేమికులకు గుడ్న్యూస్.. ప్రతి గ్రామంలో సీఎం కప్
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
జార్ఖండ్కు చెందిన హర్ష్ సిన్హా అనే వ్యక్తి బెంగళూరు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవుతుంంది. అయితే కండక్టర్ యోగేష్ ఫుట్బోర్డు మీద నిలబడొద్దని సూచించాడు. అంతే బ్యాగ్లోంచి కత్తి తీసి కండక్టర్ను పొడిచాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికులను కూడా బెదిరించాడు. ఈ దృశ్యాలు బస్సులో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయింది. యోగేష్ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) తెలిపింది.
ఇది కూడా చదవండి: AP Cabinet: ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
నిందితుడు హర్ష్ సిన్హాను బీపీవో సంస్థ తొలగించింది. మూడు వారాల నుంచి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడును అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. బస్సు ఎక్కే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కండక్టర్ ఫుట్ బోర్డు మీద నిలబడ వద్దన్నాడని చెప్పారు. ఇంతలో బ్యాగ్లోంచి కత్తి తీసి పొడిచాడని పోలీసులు వివరించారు.
ప్రయాణికులు అంతా కిందకు దిగేశారు. అనంతరం బస్సు డ్రైవర్ సిద్దలింగస్వామి డోర్ లాక్ చేసి బయటకు దూకగా హర్ష లోపల ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత బస్సులోంచి తప్పించుకునేందుకు అద్దాల తలుపులను తన్నడం, పగలగొట్టడం చేశాడు. నిందితుడు బస్సులో చిక్కుకోవడంతో డ్రైవర్, ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేసి నిందితుడిని పట్టించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
CCTV Footage Shows Bengaluru Man Stabbing Bus Conductor After Door Warning
A 25-year-old man was arrested in #Bengaluru for stabbing a #BMTC conductor after being asked to move away from the door. #cctv #bengalurucrime #knife pic.twitter.com/GccN6X66FW
— Madhuri Adnal (@madhuriadnal) October 2, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!