Bomb Hoax Call: పోలీసులకు బూటకపు బాంబు బెదిరింపు.. గంటల వ్యవధిలో అరెస్ట్
Bomb Hoax Call: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల 26/11 తరహా దాడి చేస్తామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్కు పాకిస్థాన్ నుంచి మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని రద్దీగా ఉండే జవేరీ బజార్ ప్రాంతంలో బాంబు ఉందని ఓ వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు. స్పందించిన పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని సోదాలు చేశారు. అది నకిలీ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బూటకపు కాల్ చేసినందుకు 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.నిందితుడు దినేష్ సుతార్, దక్షిణ ముంబైలోని కల్బాదేవి రోడ్లో నివసిస్తున్నాడు, ఆదివారం ఉదయం అహ్మద్నగర్ జిల్లాలోని జామ్ఖేడ్లో అమర్చిన బాంబు గురించి ముంబై పోలీసు కంట్రోల్ రూమ్కు కాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జవేరీ బజార్ ప్రాంతంలోని రద్దీ ప్రాంతం అయిన అయిన ‘ఖౌ గల్లీ’ వద్ద బాంబు పెట్టడం గురించి సుతార్ కంట్రోల్ రూమ్కి మళ్లీ కాల్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని తినుబండారాలను నిమిషాల వ్యవధిలో ఖాళీ చేశారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు. తమ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ 112లో కంట్రోల్ రూమ్కు వచ్చిన కాల్ల గురించి పోలీసులు క్రైమ్ బ్రాంచ్ టీమ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)కి కూడా సమాచారం అందించారు.
Also Read
కాల్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ నంబర్ను ట్రేస్ చేసిన తర్వాత క్రైమ్ బ్రాంచ్ బృందం నిందితుడిని భూలేశ్వర్లో ట్రాక్ చేసినట్లు ఆయన తెలిపారు. లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది నిందితుడికి ఫోన్ చేసి బాంబు ఎక్కడ అమర్చారో చూపించాలని కోరారు. అతడిని ప్రశ్నించగా అది ఫేక్ కాల్ అని తేలింది. ఆగ్రహంతో ఊగిపోయిన పోలీసులు గంటల్లో అతన్ని పట్టుకున్నారని ఓ అధికారి తెలిపారు.భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 506 (2) (నేరపూరిత బెదిరింపు), 505 (1) (బి) (పుకారుతో కూడిన ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించడం, ప్రచురించడం లేదా ప్రసారం చేయడం), ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
Yogi Adityanath: అయోధ్యలో సీఎం యోగి గుడి.. ప్రతిరోజు రెండుసార్లు పూజలు
షోలాపూర్ జిల్లా సంగోలాకు చెందిన సుతార్ తన బంధువులతో గొడవ పడి 10 రోజుల క్రితం ముంబైకి వచ్చి గతంలో పనిచేసిన కల్బాదేవిలో ఉంటున్నాడని తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు ఇటీవల తన ప్రియురాలితో విడిపోయినందున అసంతృప్తితో ఉన్నాడని, తదుపరి విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో