Supreme Court: 89 ఏళ్ల వ్యక్తికి భార్య నుంచి విడాకులు తిరస్కరించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులనేవి చాలా వరకు తక్కువ. ప్రతీ 100 వివాహాల్లో ఒక్కరు మాత్రమే విడాకుల వరకు వెళ్తున్నారు. హింస, క్రూరత్వం వంటి కేసుల్లో ఇటు మహిళలు, అటు పురుషులు విడాకులను కోరుతున్నారు. కోర్టు అన్ని సాక్ష్యాలను పరిశీలించి నిజం అని తేలితేనే విడాకులను మంజూరు చేస్తోంది. దంపతులు కలిసి ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చిన్న చిన్న వివాదాలకు విడిపోవడాన్ని కోర్టులు ప్రశ్నించడం గతంలో చూశాం.
తన భార్య నుంచి విడాకులు కావాలని కోరిన 89 ఏళ్ల వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాదాపుగా 27 పాటు కొనసాగిన ఈ కేసులో విడాకులను తిరస్కరించింది. వివాహాన్ని రద్దు చేస్తే భార్యకు అన్యాయం జరుగుతుందని కోర్టు తీర్పులో పేర్కొంది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. నిర్మల్ సింగ్ పనేసర్(89), 1963లో వివాహం చేసుకున్నాడు. అయితే 1984లో దంపతుల బంధానికి బీటలు వారింది. ఇండియన్ ఎయిర్ఫోర్సులో పనిచేస్తున్న నిర్మల్ సింగ్కి ఆ ఏడాది చెన్నైకి ట్రాన్స్పర్ అయింది. అయితే ఆయన భార్య పరంజిత్ కౌర్ పనేసర్(86)మాత్రం ఆయనతో పాటు అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది.
Read Also: Israel-Hamas War: భారత్లోని ఇజ్రాయిలీలకు భద్రత.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు..
ఈ విషయంపై క్రూరత్వం కింద 1996లో భార్యతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాడు. 2000లో జిల్లా కోర్లు విడాకులు మంజూరు చేసింది. అయితే భార్య పరంజిత్ కౌర్ పై న్యాయస్థానాల్లో తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసింది. ఈ కేసులు సుప్రీం ముందుకు రావడానికి మరో రెండు దశాబ్ధాలు పట్టింది. తాజాగా సుప్రీంకోర్టు వీరిద్దరికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది.
వివాహం అనేది భారతీయ సమాజంలో భార్యభర్తల మధ్య పవిత్రమైన, ఆధ్యాత్మిక, అమూల్యమైన భావోద్వేగ జీవిత వలయమని గురువారం తన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులు తీసుకుందనే కళంకంతో తాను చనిపోవాలని కోరుకోవడం పరంజీత్ కౌర్ కోర్టుకు తెలిపింది, విడాకులు మంజూరు చేస్తే ఆమెకు అన్యాయం జరుగుతుందని తీర్పులో పేర్కొంది. తాను ఈ పవిత్రబంధాన్ని గౌరవించడానికి అన్ని ప్రయత్నాలు చేశానని, వృద్ధాప్యంలో తన భర్తను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె కోర్టు చెప్పింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..