మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తుండేవి. కానీ, పశ్చిమ బెంగాల్లో మమత ఒక్కరే తలపడ్డారు. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అయితే, గతంలో బెంగాలో చక్రం తిప్పిన వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నది. దేశంలో కరోనా, నిరుద్యోగం, పెట్రోల్ ధరల పెరుగుదల, రైతు సమస్యలు వంటివి కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నాయి.
Read: చిరు ‘లూసిఫర్’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఈ సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని కలిసి పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే బలహీనంగా ఉండటం దీదీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నది. ఎందుకంటే, బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీని తృణమూల్ చావుదెబ్బ కొట్టింది. అటు వామపక్ష పార్టీలు సైతం మట్టికరిసిపోయాయి. ఇది దీదీకి కొండంత బలాన్ని ఇచ్చాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఎన్నికలకు ముందు పార్టీని వదిలి వెళ్లిన నేతలు తిరిగి పార్టీలో చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలో బలమైన నేతగా ఉన్న ప్రధాని మోడిని ఎదుర్కొనే సత్తా దీదీకి ఉందని అనేక కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన దీదీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది అనడంలో సందేహం అవసరం లేదు. ఇందులో భాగంగానే దీదీ నాలుగు రోజుల పాటు ఢీల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఢీల్లీలో ఉంటారు కాబట్టి మంతనాలు జరిపేందుకు వీలుగా ఉంటుంది. ఒకవేళ దీదీ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగితే పోరు మరింత రసవత్తరంగా సాగుతుంది అనడంలో సందేహం అవసరం లేదు. అటు ఆప్ కూడా క్రమంగా రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి పావులు కదుపుతున్నది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..