Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
- బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న హైడ్రామా..
- సీఎం పదవి రాజీనామాకు మమతా బెనర్జీ ససేమిరా..
- ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు దీదీ..
- రాష్ట్రపతి పాలన విధించుకోవాలని కేంద్రానికి సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బెంగాల్ రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 స్థానాలు గెలుచుకుని బంపర్ విక్టరీ సాధించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 80 స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, తాను సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని మమతా స్పష్టం చేశారు. 100 స్థానాల్లో విజయాన్ని దొంగిలించారంటూ బీజేపీపై మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఎన్నికల్ని అక్రమంగా నిర్వహించాయని ఆరోపించారు.
Read Also: VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
Also Read
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
- Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
ఇదిలా ఉంటే.. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆమె బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో బీజేపీ గెలుపును సవాల్ చేస్తానని ప్రకటించారు. స్థానికంగా ఓటములు ఎదురైనా, తన ప్రాథమిక లక్ష్యం ఢిల్లీ పీఠమే అని, ఇండియా కూటమి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని ఆమె అన్నారు.
సంబంధిత వర్గాల సమచారం ప్రకారం.. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా దొంగిలించబడిన గెలుపుకు నిరసనగా తాను పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అభిషేక్ బెనర్జీ కూడా చెప్పాడు. ఎన్నికల ప్రక్రియకు నిరసనగా తాము పదవిలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పింది. కేంద్రం చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని, అయితే, ఈ విషయం అధికారిక రికార్డుల్లో నమోదు కావాలని మమతా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
-
Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!