Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
- బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న హైడ్రామా..
- సీఎం పదవి రాజీనామాకు మమతా బెనర్జీ ససేమిరా..
- ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు దీదీ..
- రాష్ట్రపతి పాలన విధించుకోవాలని కేంద్రానికి సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బెంగాల్ రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 స్థానాలు గెలుచుకుని బంపర్ విక్టరీ సాధించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 80 స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, తాను సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని మమతా స్పష్టం చేశారు. 100 స్థానాల్లో విజయాన్ని దొంగిలించారంటూ బీజేపీపై మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఎన్నికల్ని అక్రమంగా నిర్వహించాయని ఆరోపించారు.
Read Also: VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
Also Read
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
ఇదిలా ఉంటే.. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆమె బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో బీజేపీ గెలుపును సవాల్ చేస్తానని ప్రకటించారు. స్థానికంగా ఓటములు ఎదురైనా, తన ప్రాథమిక లక్ష్యం ఢిల్లీ పీఠమే అని, ఇండియా కూటమి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని ఆమె అన్నారు.
సంబంధిత వర్గాల సమచారం ప్రకారం.. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా దొంగిలించబడిన గెలుపుకు నిరసనగా తాను పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అభిషేక్ బెనర్జీ కూడా చెప్పాడు. ఎన్నికల ప్రక్రియకు నిరసనగా తాము పదవిలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పింది. కేంద్రం చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని, అయితే, ఈ విషయం అధికారిక రికార్డుల్లో నమోదు కావాలని మమతా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..