Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
- బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న హైడ్రామా..
- సీఎం పదవి రాజీనామాకు మమతా బెనర్జీ ససేమిరా..
- ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు దీదీ..
- రాష్ట్రపతి పాలన విధించుకోవాలని కేంద్రానికి సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బెంగాల్ రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 స్థానాలు గెలుచుకుని బంపర్ విక్టరీ సాధించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 80 స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, తాను సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని మమతా స్పష్టం చేశారు. 100 స్థానాల్లో విజయాన్ని దొంగిలించారంటూ బీజేపీపై మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఎన్నికల్ని అక్రమంగా నిర్వహించాయని ఆరోపించారు.
Read Also: VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
ఇదిలా ఉంటే.. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆమె బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో బీజేపీ గెలుపును సవాల్ చేస్తానని ప్రకటించారు. స్థానికంగా ఓటములు ఎదురైనా, తన ప్రాథమిక లక్ష్యం ఢిల్లీ పీఠమే అని, ఇండియా కూటమి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని ఆమె అన్నారు.
సంబంధిత వర్గాల సమచారం ప్రకారం.. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా దొంగిలించబడిన గెలుపుకు నిరసనగా తాను పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అభిషేక్ బెనర్జీ కూడా చెప్పాడు. ఎన్నికల ప్రక్రియకు నిరసనగా తాము పదవిలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పింది. కేంద్రం చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని, అయితే, ఈ విషయం అధికారిక రికార్డుల్లో నమోదు కావాలని మమతా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!