Mamata Banerjee: నన్ను చంపినా.. వక్ఫ్ చట్టం అమలు చేయను
- బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయం
- మైనార్టీలకు అండగా ఉంటానన్న మమత
- వచ్చే ఏడాది బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ముర్షిదాబాద్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి.. పోలీస్ వాహనాలు తగలబెట్టారు. తాజాగా ఇదే అంశంపై జైన సమాజం నిర్వహించిన విశ్వ నవకార్ మహామంత్ర దివస్లో మమత పాల్గొని మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Priyansh Arya: నమస్కారం సర్.. నా ఇన్నింగ్స్ ఎలా ఉంది!
Also Read
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
మతం ప్రాతిపదికన బెంగాల్ను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించబోనని మమత తేల్చి చెప్పారు. తనను చంపినా పర్వాలేదు.. కానీ ఐక్యతను మాత్రం దెబ్బతియ్యనని చెప్పుకొచ్చారు. ముస్లింలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచాలన్నారు. వక్ఫ్ చట్టం అమలు కాకుండా.. ముస్లింలను రక్షించే బాధ్యత తనదేనన్నారు.
ఇది కూడా చదవండి: Summer Tips: వేసవిలో తాటి ముంజలుతో ఎన్ని లాభాలో..!
చాలా మంది తనను అన్ని మతాల ప్రదేశాలను ఎందుకు సందర్శిస్తారని అడుగుతారని.. అలాంటి వారికి ఏం చెబుతానంటే.. జీవితాంతం సందర్శిస్తూనే ఉంటానని చెబుతానన్నారు. తనను కాల్చి చెంపినా.. ఐక్యత నుంచి వేరు చేయలేరన్నారు. బెంగాల్లో విభజనకు తావుండదని మమత తేల్చి చెప్పారు.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏప్రిల్ 8 నుంచి అల్లర్లు జరుగుతున్నాయి. పోలీస్ వాహనాలు తగలబెట్టారు. రాళ్లు రువ్వారు. బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 30 శాతం ఉన్నారు. వీళ్లంతా తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మైనార్టీలకు అండగా ఉంటానని మమత హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Jagadish Reddy: వాళ్లు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారు..
తాజావార్తలు
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!