Mamata Banerjee: ఎగ్జిట్ పోల్స్ని అంగీకరించేదే లేదు.. ధైర్యంగా ఉండాలన్న మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నిన్న వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మరోసారి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మేది లేదని, వాటిని బహిష్కరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ మోసపూరిత వ్యూహాలకు లొంగకుండా పార్టీ కార్యకర్తలు బలంగా ఉండాలని కోరారు. తాము 2016, 2019, 2021లో చూసినట్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుగా ఉన్నాయని, దీనికి కారణంగా తుది ఫలితాలను తారుమారు చేయడానికి గోడి మీడియాకు భారీ మొత్తాన్ని బీజేపీ చెల్లిస్తోందని వ్యాఖ్యానించారు.
Read Also: Prajwal Revanna Case: ప్రజ్వల్ కేసులో ఐఫోన్ సర్వర్ యాక్సెస్ కోరుతున్న పోలీసులు.. కారణం ఏంటంటే..
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
2024 లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరు కనబరుస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ చూశామని, ఇది అసలైన ఫలితాలతో సరిపోలలేదని చెప్పారు. బీజేపీ వీటిని తయారు చేసి మీడియాకు ఇస్తుందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కన్నా బీజేపీకి ఈ సారి ఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీని తర్వాత మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం, పశ్చిమ బెంగాల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ 21-24 సీట్లు గెలుచుకుంటుంది. టీఎంసీ 18-21 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా టీవీ పోల్ ప్రకారం ఎన్డీయేకు 22-26 సీట్లు, టీఎంసీకి 14-18 సీట్లు, కాంగ్రెస్కు 1-2 సీట్లు వస్తాయని చెప్పింది. ఏబీపీ న్యూస్-సీఓటర్ ప్రకారం.. బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్కు 13-17 సీట్లు వస్తాయని అంచనా.ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకారం, బీజేపీకి 26-31 సీట్లు, టీఎంసీకి 11-14 సీట్లు, ఇండియా కూటమికి 0-2 సీట్లు వస్తాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!