Mamata Banerjee: ఎగ్జిట్ పోల్స్ని అంగీకరించేదే లేదు.. ధైర్యంగా ఉండాలన్న మమతా బెనర్జీ..
Mamata Banerjee: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నిన్న వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మరోసారి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మేది లేదని, వాటిని బహిష్కరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ మోసపూరిత వ్యూహాలకు లొంగకుండా పార్టీ కార్యకర్తలు బలంగా ఉండాలని కోరారు. తాము 2016, 2019, 2021లో చూసినట్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుగా ఉన్నాయని, దీనికి కారణంగా తుది ఫలితాలను తారుమారు చేయడానికి గోడి మీడియాకు భారీ మొత్తాన్ని బీజేపీ చెల్లిస్తోందని వ్యాఖ్యానించారు.
Read Also: Prajwal Revanna Case: ప్రజ్వల్ కేసులో ఐఫోన్ సర్వర్ యాక్సెస్ కోరుతున్న పోలీసులు.. కారణం ఏంటంటే..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
2024 లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరు కనబరుస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ చూశామని, ఇది అసలైన ఫలితాలతో సరిపోలలేదని చెప్పారు. బీజేపీ వీటిని తయారు చేసి మీడియాకు ఇస్తుందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కన్నా బీజేపీకి ఈ సారి ఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీని తర్వాత మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం, పశ్చిమ బెంగాల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ 21-24 సీట్లు గెలుచుకుంటుంది. టీఎంసీ 18-21 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా టీవీ పోల్ ప్రకారం ఎన్డీయేకు 22-26 సీట్లు, టీఎంసీకి 14-18 సీట్లు, కాంగ్రెస్కు 1-2 సీట్లు వస్తాయని చెప్పింది. ఏబీపీ న్యూస్-సీఓటర్ ప్రకారం.. బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్కు 13-17 సీట్లు వస్తాయని అంచనా.ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకారం, బీజేపీకి 26-31 సీట్లు, టీఎంసీకి 11-14 సీట్లు, ఇండియా కూటమికి 0-2 సీట్లు వస్తాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!