Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
- ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు మమత ససేమిరా!
- లోక్భవన్కు వెళ్లబోనని ప్రకటన
- మమత ప్రకటనపై న్యాయ నిపుణుల అంచనాలు ఇవే
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అది పెద్ద శక్తిగా నిలిచింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు మమతా బెనర్జీ సహకరించాలి. కానీ అందుకు భిన్నంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్భవన్కు కూడా వెళ్లను.’’ అని ప్రకటించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మేధావులు, న్యాయ నిపుణుల నుంచి రకరకాలైన విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ కాలం మే 7తో ముగుస్తోంది. అనంతరం ఆమె పదవిలో కొనసాగడానికి వీలుండదు. రాజీనామా చేయకపోయినా ఆమె ప్రభావం ఉండదు. రాష్ట్ర గవర్నర్కు అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఆటోమేటిక్గా ముగిసినట్లే అవుతుంది.’’ అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read
- AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
- Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
- Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. అయితే ప్రతిఘటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసినందున గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారని.. దీంతో ఆటోమేటిక్గా మమత ప్రభుత్వ పదవీకాలం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు.
మమత ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.
తాజావార్తలు
-
AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
-
US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!