Mamata Banerjee: అభిషేక్పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
- సోనార్పూర్లో అభిషేక్ బెనర్జీపై దాడి.
- బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.
- "పాలకులే హంతకులుగా మారారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు.
- దాడి వెనుక బీజేపీ ఉందని అభిషేక్ ఆరోపణ.
- స్థానికుల ఆగ్రహమే కారణమని బీజేపీ కౌంటర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సోనార్పూర్లో మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. స్థానిక ప్రజలు ఆగ్రహంతో శనివారం ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘‘పాలకులు హంతకులుగా మారారు’’ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది.
అభిషేక్ దాడిపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా మమతతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చేతులు కలిపాయి. ప్రముఖ ఎంపీకి పోలీసు భద్రత లేకపోవడం చాలా తీవ్రమైన విషయమని అన్నారు. ఎక్స్లో మమత స్పందిస్తూ.. ‘‘పాలకులే ఇప్పుడు హంతకులుగా మారారు. ఈ చర్యకు బీజేపీ సిగ్గుపడాలి.’’ అని రాశారు. మరోవైపు తనపై బీజేపీ వాళ్లే దాడికి పాల్పడ్డారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ దాడిని కక్షపూరిత రాజకీయంగా అభివర్ణించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం విధ్వేష రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేయడం లేదని అన్నారు.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా స్పందించింది. ఇది స్థానిక ప్రజలు చేసిన దాడి అని, దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఎన్నిలక సమయంలో అభిషేక్ బెనర్జీ బహిరంగంగా బీజేపీ కార్యకర్తల్ని బెదిరించారని, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా సవాల్ చేశారని అన్నారు. సీఎం సువేందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పదే పదే దాడులు జరిగాయని, దీని వెనక అభిషేక్ నెట్వర్క్ ఉందని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ చీఫ్ సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. అహంకారం, ఏకపక్ష భావజాలం ఎక్కువ కాలం నిలువదని టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RULERS BECAME KILLERS- shame on you BJP https://t.co/DHNsnDAc9a
— Mamata Banerjee (@MamataOfficial) May 30, 2026
बंगाल में तृणमूल कांग्रेस के महत्वपूर्ण नेता श्री अभिषेक बनर्जी जी के ऊपर जानलेवा हमला करवाकर बंगाल की अराजक भाजपा सरकार ने साबित कर दिया है कि भाजपा नफ़रत भरी नकारात्मक हिंसक राजनीति के सिवा और कुछ नहीं कर सकती है। इतने संवेदनशील वातावरण में भी पुलिस की व्यवस्था न होना एक बड़ी…
— Akhilesh Yadav (@yadavakhilesh) May 30, 2026
తాజావార్తలు
-
TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్… ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!