Mamata Banerjee: అభిషేక్పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
- సోనార్పూర్లో అభిషేక్ బెనర్జీపై దాడి.
- బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.
- "పాలకులే హంతకులుగా మారారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు.
- దాడి వెనుక బీజేపీ ఉందని అభిషేక్ ఆరోపణ.
- స్థానికుల ఆగ్రహమే కారణమని బీజేపీ కౌంటర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సోనార్పూర్లో మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. స్థానిక ప్రజలు ఆగ్రహంతో శనివారం ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘‘పాలకులు హంతకులుగా మారారు’’ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది.
అభిషేక్ దాడిపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా మమతతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చేతులు కలిపాయి. ప్రముఖ ఎంపీకి పోలీసు భద్రత లేకపోవడం చాలా తీవ్రమైన విషయమని అన్నారు. ఎక్స్లో మమత స్పందిస్తూ.. ‘‘పాలకులే ఇప్పుడు హంతకులుగా మారారు. ఈ చర్యకు బీజేపీ సిగ్గుపడాలి.’’ అని రాశారు. మరోవైపు తనపై బీజేపీ వాళ్లే దాడికి పాల్పడ్డారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ దాడిని కక్షపూరిత రాజకీయంగా అభివర్ణించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం విధ్వేష రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేయడం లేదని అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ 'Awiqli' విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
- Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా స్పందించింది. ఇది స్థానిక ప్రజలు చేసిన దాడి అని, దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఎన్నిలక సమయంలో అభిషేక్ బెనర్జీ బహిరంగంగా బీజేపీ కార్యకర్తల్ని బెదిరించారని, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా సవాల్ చేశారని అన్నారు. సీఎం సువేందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పదే పదే దాడులు జరిగాయని, దీని వెనక అభిషేక్ నెట్వర్క్ ఉందని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ చీఫ్ సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. అహంకారం, ఏకపక్ష భావజాలం ఎక్కువ కాలం నిలువదని టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RULERS BECAME KILLERS- shame on you BJP https://t.co/DHNsnDAc9a
— Mamata Banerjee (@MamataOfficial) May 30, 2026
बंगाल में तृणमूल कांग्रेस के महत्वपूर्ण नेता श्री अभिषेक बनर्जी जी के ऊपर जानलेवा हमला करवाकर बंगाल की अराजक भाजपा सरकार ने साबित कर दिया है कि भाजपा नफ़रत भरी नकारात्मक हिंसक राजनीति के सिवा और कुछ नहीं कर सकती है। इतने संवेदनशील वातावरण में भी पुलिस की व्यवस्था न होना एक बड़ी…
— Akhilesh Yadav (@yadavakhilesh) May 30, 2026
తాజావార్తలు
-
Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
-
Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
-
Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
-
Nissan Tecton: నిస్సాన్ టెక్టన్ SUV భారత్లో లాంచ్.. క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!