Kolkata: జూడాలకు సీఎం మమత ఫోన్.. డిమాండ్లకు 4 నెలలు సమయమివ్వాలని వినతి
- జూడాలకు సీఎం మమత ఫోన్
- డిమాండ్ల పరిష్కారానికి 4 నెలలు సమయమివ్వాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక వైద్యులకు భద్రత కల్పించాలంటూ గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేస్తు్న్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా రాజీనామాలు కూడా సమర్పించారు. అయితే ఈ రాజీనామాలను ప్రభుత్వ తిరస్కరించింది. అయితే జూడాల దీక్షపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. వైద్యులు దీక్షను వీడాలని కోరారు. డాక్టర్ల నిరసనలతో పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. వైద్య సేవలపై ప్రభావం పడకూడదని చెప్పారు. వైద్యుల డిమాండ్లలో కొన్ని ఇప్పటికే నెరవేర్చామని.. మిగతా వాటి కోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని వైద్యులను మమత కోరారు. ఈ విషయంపై చర్చించేందుకు మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: KTR : గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
జూనియర్ డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సోమవారం (21-10-2024) రావాలని మమత మరోసారి ఆహ్వానించారు. ఆర్జీ కర్ ఆసుపత్రి దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యుల వేదిక దగ్గరకు శనివారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లారు. ఈ సమయంలో సీఎం వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. వైద్యులు చేసిన పలు డిమాండ్లను నెరవేర్చడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ప్రభుత్వానికి వైద్యులు నిర్దేశించడం సరికాదని వ్యాఖ్యానించారు. వైద్యుల డిమాండ్లపై చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!
ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత ఘోరంగా హత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం సినిమా ఫేమ్ కు ఆర్థిక సహాయం!
తాజావార్తలు
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!