Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
- అభిషేక్ బెనర్జీపై దాడి తర్వాత కొత్త రాజకీయ వివాదం.
- ఆసుపత్రి సీఈవోపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వీడియో వైరల్.
- అభిషేక్కు తీవ్ర గాయాలు లేవని ఆసుపత్రి నివేదిక. బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలతో హాట్ హాట్గా బెంగాల్ రాజకీయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. నిన్న సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ నెంబర్ 2, మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధిత తృణమూల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో స్థానికులు దాడికి దిగారు. తనపై బీజేపీ కక్షసాధింపు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. పాలకులు హంతకుల్లా మారారని మమతా బెనర్జీ ఆరోపించింది.
ఇదిలా ఉంటే, తాజాగా మమతా బెనర్జీ కోల్కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్పై అరుస్తున్న వీడియోను బీజేపీ బయటపెట్టింది. సీఈఓ ప్రదీప్ టాండన్ను దీదీ హెచ్చరిస్తూ మాట్లాడింది. ‘‘క్షమించండి మిస్టర్ టాండన్, మీరు తప్పు చేశారు. మేము మీ కోసం ఇంకేం చేశామో దయచేసి గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు పొరపాటు చేశారు. దానికి మీరు సిగ్గుపడాలి. మీ అహంకారాన్ని అందరూ గుర్తుంచుకుంటారు, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే మీరు ఆసుపత్రిని నడుపుతూ వైద్యులను బెదిరిస్తున్నారు. రేపు కేంద్ర ప్రభుత్వం లేకపోతే, మేమే చూసుకుంటాం’’ అని అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఈ వీడియోను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేబ్జిత్ సర్కార్ షేర్ చేస్తూ.. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎలాంటి చెప్పుకోదగ్గ గాయాలు కానప్పటికీ అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని మమతపై ఆరోపణలు గుప్పతించారు. సీఐడీ సమన్ల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా అభిషేక్ బెనర్జీపై ఆరోపణలు చేశారు.
దాడి తర్వాత ఛాతిపై కమిలిన గాయాలు మినహా, తీవ్రమైన శారీరక గాయాలు లేవని, రోగి మాట్లాడుతున్నారని, పూర్తిగా స్పృహలో ఉన్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, తన మేనల్లుడిని ఆస్పత్రిలో చేర్చుకోవద్దని బీజేపీ ఒత్తిడి తెస్తుందని మమతా ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Shame on @MamataOfficial for her conduct at the hospital emergency ward. Is this an attempt to evade the CID summons to Abhishek Banerjee? Patients who genuinely need treatment should not suffer because of political pressure. No one is above the law. https://t.co/91pLrrXewC pic.twitter.com/F3o0vI1X8J
— Debjit Sarkar (@Bjp_Debjit) May 31, 2026
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!