Maharashtra CM Post: సీఎం ఎంపిక మరింత ఆలస్యం కానుందా? కారణమిదేనా..!
- వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ
- మరిన్ని రోజులు కొనసాగే అవకాశం
- డిసెంబర్ 2 లేదా 5న ప్రమాణస్వీకారం ఉండే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది. నవంబర్ 23న విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 132 సీట్లు దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ పొత్తు ధర్మం కారణంగా సమస్య కొలిక్కి రావడం లేదు. ఇంకో వైపు జార్ఖండ్లో మాత్రం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసేశారు. మహారాష్ట్ర పంచాయితీ మాత్రం సస్పెన్ష్ థిల్లర్గా సాగుతోంది. ఇక శుక్రవారం ముంబైలో మహాయుతి కూటమి సమావేశం జరగాల్సి ఉండగా.. హఠాత్తుగా రద్దైంది. దీంతో సీఎం ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్తో వేర్వేరుగా సమావేశమై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి గాను, శివసేన, ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎంలు ఉండేలా ప్రతిపాదన వచ్చినట్లుగా సమాచారం. అలాగే బీజేపీకి 22, శివసేనకు 12, ఎన్సీపీకి 9 మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. అయితే ఈ ప్రతిపాదనకు షిండే మొగ్గు చూపలేదని తెలుస్తోంది. తన కుమారుడి భవిష్యత్ను పరిష్కరించాలని షిండే పట్టుబట్టినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా కీలకమైన హోంశాఖతో పాటు అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ వర్క్స్ మరియు మరికొన్ని కీలక పోర్ట్ఫోలియోలను శివసేన అడుగుతుంది. అయితే హోం శాఖను మాత్రం వదులుకోవడానికి బీజేపీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మహాయుతిలో తర్జన భర్జన జరుగుతోంది.
Also Read
- IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే...! IVF ముసుగులో ఇంత దారుణమా
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
ఇదిలా ఉంటే రెండ్రోజులు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏదొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం డిసెంబర్ 2 గానీ, లేదంటే డిసెంబర్ 5న గానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పోస్టు తీసుకోవాలంటూ షిండేను ఒప్పిస్తున్నారు. కానీ ఆయన పై నుంచి మెట్టు దిగేందుకు మనసు అంగీకారంగా లేనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ పార్టీ 10 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కాలం ఇప్పటికే ముగిసింది. కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. అయితే రాష్ట్రపతి పాలన వస్తుందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. త్వరలోనే మహాయుతి ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ పెద్దలు అంటున్నారు.
తాజావార్తలు
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
-
Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
-
Mutual Funds: ఆదాయం తక్కువగా ఉందని బాధపడుతున్నారా? ఈ పెట్టుబడితో ధనవంతులైపోవచ్చు..!
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!