Maharashtra Political Crisis: రాజ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే ఫోన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సోమవారం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో 2 గంటలకు భేటీ కాబోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరుపుతున్నారు.
తాజాగా మహారాష్ట్రలో మరో కీలక పరిణామా చోటు చేసుకుంది. రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేతో రెండు సార్లు ఫోన్ లో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరు చర్చించారు. ఇదే విధంగా రాజ్ ఠాక్రే ఆరోగ్యం పరిస్థితి గురించి షిండే ఆరా తీశారు.
Also Read
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
మరోవైపు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంతో పాటు అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసిన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అన్నారు.. వారికి మద్దతు ఇవ్వడం కన్నా చనిపోవడం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ముంబై బాంబు పేలుళ్ల నిందితులు దావూద్ ఇబ్రహీం మరియు అమాయకుల ప్రాణాలను తీయడానికి కారణమైన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఇతర ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అస్సాంలో క్యాంప్ చేస్తున్న షిండే ఆదివారం నాడు పార్టీపై విరుచుకుపడ్డారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్నవారికి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రవ్నించారు. హిందుత్వ భావజాలాన్ని అనుసరించడానికి రెబెల్ ఎమ్మెల్యేలు చనిపోవాల్సి వచ్చినా.. దానిని విధిగా భావిస్తారని ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shweta Singh: సుశాంత్ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!