Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
- మహారాష్ట్రలో అమానుష ఘటన
- మాతృత్వానికి మాయని మచ్చ
- మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలే ఘోర అమానుష సంఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భవతికి అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే మగబిడ్డకు జన్మినిచ్చింది. అనంతరం ఒక గుడ్డలో చుట్టి బస్సులోంచి విసిరేసింది. డ్రైవర్ అద్దంలోంచి చూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!
Also Read
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
- Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
రితికా ధేరే(19) అనే యువతి, భర్త అని చెప్పుకునే అల్తాఫ్ షేక్తో కలిసి సంత్ ప్రయాగ్ ట్రావెల్స్లో స్లీపర్ కోచ్ బస్సులో పూణె నుంచి పర్భానీకి వెళ్తున్నారు. రితికా గర్భవతిగా ఉంది. ఉన్నట్టుండి రితికాకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. ప్రసవ వేదనకు గురైన ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువును ఒక గుడ్డ ముక్కలో చుట్టి బస్సులోంచి విసిరేశారు. అయితే బస్సులో ఎగువ, దిగువ బెర్తులు ఉన్నాయి. అయితే కిటికీలోంచి ఏదో విసిరేసినట్లుగా డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సు ఆపి ఆరా తీయగా.. ప్రయాణం కారణంగా భార్యకు వాంతులు అయ్యాయని భర్త షేక్ చెప్పాడు. అయితే రోడ్డుపై స్థానికుడు ఉండడంతో బస్సులోంచి ఏదో పడినట్లుగా గమనించాడు. వెంటనే వెళ్లి చూడగా మగ శిశువు అని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే 112 హెల్ప్లైన్కు ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Phone Tapping: నేడు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్రావు..
పెట్రోలింగ్ విధుల్లో ఉన్న స్థానిక పోలీసుల బృందం బస్సును అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత రితికా, షేక్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బిడ్డను పెంచలేకపోవడంతోనే శిశువును విసిరేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే శిశువును రోడ్డుపై పడేయడంతో చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితికా, షేక్ ఇద్దరూ పర్భానీకి చెందినవారని.. గత ఒకటిన్నర సంవత్సరాలుగా పూణేలో నివసిస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారని.. అందుకు వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఎలాంటి పత్రాలు కూడా చూపించలేదని పోలీస్ అధికారి చెప్పారు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పత్రి-సేలు రోడ్డులో జరిగిందని.. స్థానిక పౌరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: మలక్పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
రితికా, షేక్ను అదుపులోకి తీసుకున్నారు. పర్భానీలోని పత్రి పోలీస్ స్టేషన్లో జంటపై BNS సెక్షన్ 94 (3), (5) (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా జననాన్ని దాచిపెట్టడం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు నోటీసులు అందజేశామని.. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!