Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
- మహారాష్ట్రలో అమానుష ఘటన
- మాతృత్వానికి మాయని మచ్చ
- మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలే ఘోర అమానుష సంఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భవతికి అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే మగబిడ్డకు జన్మినిచ్చింది. అనంతరం ఒక గుడ్డలో చుట్టి బస్సులోంచి విసిరేసింది. డ్రైవర్ అద్దంలోంచి చూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
రితికా ధేరే(19) అనే యువతి, భర్త అని చెప్పుకునే అల్తాఫ్ షేక్తో కలిసి సంత్ ప్రయాగ్ ట్రావెల్స్లో స్లీపర్ కోచ్ బస్సులో పూణె నుంచి పర్భానీకి వెళ్తున్నారు. రితికా గర్భవతిగా ఉంది. ఉన్నట్టుండి రితికాకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. ప్రసవ వేదనకు గురైన ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువును ఒక గుడ్డ ముక్కలో చుట్టి బస్సులోంచి విసిరేశారు. అయితే బస్సులో ఎగువ, దిగువ బెర్తులు ఉన్నాయి. అయితే కిటికీలోంచి ఏదో విసిరేసినట్లుగా డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సు ఆపి ఆరా తీయగా.. ప్రయాణం కారణంగా భార్యకు వాంతులు అయ్యాయని భర్త షేక్ చెప్పాడు. అయితే రోడ్డుపై స్థానికుడు ఉండడంతో బస్సులోంచి ఏదో పడినట్లుగా గమనించాడు. వెంటనే వెళ్లి చూడగా మగ శిశువు అని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే 112 హెల్ప్లైన్కు ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Phone Tapping: నేడు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్రావు..
పెట్రోలింగ్ విధుల్లో ఉన్న స్థానిక పోలీసుల బృందం బస్సును అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత రితికా, షేక్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బిడ్డను పెంచలేకపోవడంతోనే శిశువును విసిరేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే శిశువును రోడ్డుపై పడేయడంతో చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితికా, షేక్ ఇద్దరూ పర్భానీకి చెందినవారని.. గత ఒకటిన్నర సంవత్సరాలుగా పూణేలో నివసిస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారని.. అందుకు వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఎలాంటి పత్రాలు కూడా చూపించలేదని పోలీస్ అధికారి చెప్పారు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పత్రి-సేలు రోడ్డులో జరిగిందని.. స్థానిక పౌరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: మలక్పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
రితికా, షేక్ను అదుపులోకి తీసుకున్నారు. పర్భానీలోని పత్రి పోలీస్ స్టేషన్లో జంటపై BNS సెక్షన్ 94 (3), (5) (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా జననాన్ని దాచిపెట్టడం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు నోటీసులు అందజేశామని.. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?