Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!
- పహల్గామ్ ఉగ్ర దాడిపై కీలక అప్డేట్
- 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి ముష్కరులు కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన స్థానికులను అరెస్ట్ చేశారు. అలాగే సంఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులను అధికారులు విచారించారు.
అయితే పహల్గామ్లో ఉగ్రవాదులు తమ పని పూర్తి చేశాక.. సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు అధికారులకు వెల్లడించాడు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినట్లుగా పేర్కొన్నాడు.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
ఇది కూడా చదవండి: Hyderabad: మలక్పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
ఇక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాట్కోట్ నుంచి పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్కు నుంచి బషీర్ అహ్మద్ జోథర్గా గుర్తించారు. బాట్కోట్, హిల్ పార్క్ రెండు ప్రాంతాలు కూడా పహల్గామ్లోనే ఉన్నాయి. విచారణలో ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఉగ్రవాదులు… లష్కరే తోయిబా (LeT)తో అనుబంధంగా ఉన్న పాకిస్థాన్ పౌరులుగా నిర్ధారించారు. హిల్ పార్కులోని ఒక గుడిసెలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ఆహారం, లాజిస్టికల్ మద్దతు అందించారు. ఇక పర్వైజ్, బషీర్ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారి మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్
ఇక ప్రత్యక్ష సాక్షి దర్యాప్తు సంస్థతో కీలక విషయాలు పంచుకున్నాడు. 26 మందిని చంపిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు వెళ్లిపోతుండగా తనను ఆపారని చెప్పాడు. కల్మా పఠించమని అడిగారని.. తాను స్థానిక యాసలో మాట్లాడడంతో తనను విడిచిపెట్టేశారని పేర్కొన్నాడు. అనంతరం సంతోషంగా నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పుకొచ్చాడు. ఇక పర్వైజ్, బషీర్ కొండ దగ్గర నిలబడి.. ఉగ్రవాదుల వస్తువులను చూసుకున్నారని వెల్లడించాడు. కాల్పులు అయిపోయాక.. ముష్కరులు వస్తువులు తీసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నాడు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేశారు. మతం ఆధారంగా దాడి చేశారు. ముస్లిం వ్యతిరేకులను 26 మందిని చంపేశారు. అయితే ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తు్న్నారు. ముగ్గురు పాకిస్థానీలు హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, ఆసిఫ్ ఫౌజీ, అనంతనాగ్ నివాసి అయిన స్థానిక ఉగ్రవాది అబిద్ హుస్సేన్ థోకర్ సహా నలుగురు ఉగ్రవాదుల ప్రమేయం ఉందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!