Mobile Phones Ban: అక్కడ మొబైల్ ఫోన్స్ వాడడంపై నిషేధం.. ఏకగ్రీవ తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది.. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇక, ఎవ్వరితో పనిలేదు అనేలా పరిస్థితి తయారైంది.. చిన్న, పెద్ద తేడాలేకుండా.. స్మార్ట్ఫోన్ లేకుంటే క్షణం కూడా ఉండలేకపోతున్నారు.. ఈ తరుణంలో ఓ గ్రామ పంచాయతీ చేసిన ఏకగ్రీవ తీర్మానం వైరల్గా మారిపోయింది.. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బన్నీ గ్రామంలో.. 18 ఏళ్ల లోపు చిన్నారులు, యువత మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు.. దీనిపై గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Read Also: Sajjala Ramakrishna: ఎవరైనా చంద్రబాబు భార్యని అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి?
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని బన్సీ అనే గ్రామం ఉంది.. పిల్లలు మరియు యుక్తవయస్కులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడాన్ని గమనించారు పెద్దలు.. పిల్లలు ఆటలు ఆడడం మానేశారు.. ఫోన్లలోనే గేమ్స్ చూడడమే పనిగాపెట్టుకున్నారు.. వెబ్సైట్లను సెర్చ్ చేస్తున్నారు.. వీడియో గేమ్స్ ఆడుతున్నారు.. అడ్డమైన వీడియోలు చూస్తున్నారు.. మొత్తంగా చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారని.. బన్సి గ్రామ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్తా పెద్దల దృష్టికి వెళ్లింది.. ఇంకేముంది.. 18 ఏళ్ల లోపువారు మొబైల్ ఫోన్ల వాడడంపై నిషేధం విధించారు.. దీనిపై బన్సీ గ్రామపంచాయతీ సర్పంచ్ గజానన్ టేల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను నిషేధాన్ని ఖచ్చితంగా పాటించేలా చేయాలని కోరారు.
సర్పంచ్ టేల్ చెబుతున్న ప్రకారం.. గ్రామంలోని పాఠశాల పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారారని, దానికి ప్రతిస్పందనగా, 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్లను నిషేధించాలని అధికారిక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందని స్పష్టం చేశారు.. అయితే, అమలు చేయడంలో ఇబ్బందులు ఉంటాయని మాకు తెలుసు. కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలను తొలగిస్తాం. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు.. ఇదే సమయంలో గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించారని వెల్లడించారు.. మొదట్లో వారికి కౌన్సెలింగ్ చేస్తాం.. మా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే మాత్రం జరిమానా విధిస్తామని తెలిపారు.. అయితే, జరిమానా ఎంత విధించాలి అనేదానిపై ఇంకా ఖచ్చితమైన నిర్ణయం మాత్రం తీసుకోలేదని పేర్కొన్నారు సర్పంచ్ టేల్.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?