Maharashtra: కేబినెట్ కూర్పుపై ఢిల్లీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసిపోయింది. శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరోవైపు రెండు పార్టీల సంక్షీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఇరు పార్టీల మధ్య కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. తాజాగా ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను సమావేశం అయ్యారు సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అంతకుముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ను కలిశారు వీరిద్దరు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీని వీరిద్దరు కలవనున్నారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణపై చర్చించారు. జేపీ నడ్డాతో దాదాపుగా 40 నిమిషాల పాటు సమావేశం అయిన షిండే, ఏక్ నాథ్ కేబినెట్ కూర్పుపై చర్చించారు. ప్రాథమిక చర్యల్లో షిండే వర్గానికి 11 మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ సూచింనట్లు సమాచారం. ఇక బీజేపీకి 29 మంత్రి పదవులు ఉండాలని చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. క్యాబినెట్ను రెండు దశల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు విస్తరణ జరగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో మొత్తం 288 సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీతో కలిపి 164 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
Read Also: CM Jagan: చిప్ వేలికి, కాళ్లకు ఉంటే సరిపోదు.. చినమెదడులో ఉండాలి
ఈ భేటీల అనంతరం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ… గతంలో నన్ను బీజేపీ సీఎంను చేసింది. ఇప్పుడు పార్టీ అవసరం మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండదే మా నాయకుడని.. ఆయన కింద పని చేస్తామని.. అన్యాయం పోయి మా సహజ మైత్రి మళ్లీ పుంజుకుంటుందని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని.. అప్పుడు మేము మాట్లాడలేకపోయామని.. అందుకే ఈ చర్య తీసుకున్నామని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. బీజేపీ, శివసేన సహజ కూటమి అని ఈ కూటమే మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!