Sayaji Shinde: రాజకీయాల్లోకి నటుడు సాయాజీ షిండే.. ఆ పార్టీలో చేరిక..
- రాజకీయాల్లోకి నటుడు సాయాజీ షిండే..
- అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరిక..
- మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sayaji Shinde: ప్రముఖ నటుడు సాయాజీ షిండే రాజకీయ పార్టీలో చేరారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ పార్టీలో శుక్రవారం చేరారు. అజిత్ పవార్ స్వయంగా సాయాజీ షిండేని పార్టీలోకి స్వాగతించారు. ఎన్సీపీలో చేరిన తర్వాత సాయాజీ షిండే మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా సేవ చేస్తున్నానని, తన సేవల్ని కొనసాగిస్తున్నానని అన్నారు. అజిత్ పవార్ని ప్రశంసిస్తూ.. ఆయన పార్టీ విధానాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకే ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Read Also: Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలి.. ఆదేశం
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
‘‘సినిమాల్లో రాజకీయ నాయకుల పాత్రల్ని చేశాను కానీ.. ఇంకా రాజకీయ నాయకుడిగా మారలేదు. నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాలను బయట ఉంచకుండా వ్యవస్థలోకి వచ్చి ఏదైనా మంచి పని చేస్తే బాగుంటుందని భావించాను. అందుకే నేను అజిత్ పవార్ యొక్క ఎన్సిపి విధానాలను ఇష్టపడి, ఆయన పార్టీలో చేరాను. లాడ్లీ బెహన్ యోజన పేద మహిళల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నాకు రాజకీయాల్లో ఎలాంటి స్వార్థం లేదు’’ అని సాయాజీ షిండే అన్నారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్ మాట్లాడుతూ.. షిండే అద్భుతమైన నటుడే కాదు, అద్భుతమైన వ్యక్తి, రాజకీయ నాయకుడిగా మారారని అన్నారు. రాజకీయాల్లో షిండేకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. షిండే మాతృభాష మరాఠీతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. ఇటీవల పవన్ కళ్యాణ్తో కలిసి ముచ్చటించిన వీడియో వైరల్ అయింది. పోకిరి, ఠాగూర్, గుడుంబా శంకర్, చిరుత, కిక్, అరుంధతి, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల్లో నటించారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!