Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. మూడోసారి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపడుతారని.. డిప్యూటీ సీఎం పదవి ఏక్ నాథ్ షిండేకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు గురించి బీజేపీ పెద్దలు చర్చిస్తున్నారు. సీటీ రవి, పార్టీ నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్ వంటి నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 144గా ఉంది. అయితే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో పాటు షిండే వర్గం 39 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు 12 మంది, ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరు, బీవీఏ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా మరో 07 మంది స్వతంత్రుల మద్దతు బీజేపీకి ఉంది. దీంతో బీజేపీకి మొత్తం 167 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
Also Read
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేతో ఫడ్నవీస్ ఫోన్ లో మాట్లాడరు. క్యాబినెట్ కూర్పు గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. రెబెల్ క్యాంపుతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఎవరెవరకి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. షిండే క్యాంపులో ఎమ్మెల్యేల్లో 10-12 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎవరికి, ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. త్వరలో జరుగుతుందని, అప్పటి వరకు మంత్రుల జాబితాలు, పుకార్లు నమ్మవద్దని శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే అన్నారు.
తాజావార్తలు
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!