Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. మూడోసారి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపడుతారని.. డిప్యూటీ సీఎం పదవి ఏక్ నాథ్ షిండేకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు గురించి బీజేపీ పెద్దలు చర్చిస్తున్నారు. సీటీ రవి, పార్టీ నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్ వంటి నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 144గా ఉంది. అయితే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో పాటు షిండే వర్గం 39 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు 12 మంది, ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరు, బీవీఏ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా మరో 07 మంది స్వతంత్రుల మద్దతు బీజేపీకి ఉంది. దీంతో బీజేపీకి మొత్తం 167 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేతో ఫడ్నవీస్ ఫోన్ లో మాట్లాడరు. క్యాబినెట్ కూర్పు గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. రెబెల్ క్యాంపుతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఎవరెవరకి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. షిండే క్యాంపులో ఎమ్మెల్యేల్లో 10-12 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎవరికి, ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. త్వరలో జరుగుతుందని, అప్పటి వరకు మంత్రుల జాబితాలు, పుకార్లు నమ్మవద్దని శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే అన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!