Maharashtra: ‘రమ్మీ’ మంత్రి మాణిక్రావ్ కోకటేకు మళ్లీ ఇక్కట్లు.. పదవికి రాజీనామా
- మహారాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయ కుదుపు
- కేసులో దోషిగా తేలిన మంత్రి మాణిక్రావ్ కోకటే
- తీర్పు వెలువడిన కొన్ని గంటలకే పదవికి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు దశాబ్దాల నాటి కేసు మహారాష్ట్ర మంత్రి మెడకు చుట్టుకుంది. 1995 గృహనిర్మాణ కుంభకోణం కేసులో మంత్రి మాణిక్రావ్ కోకటే, ఆయన సోదరుడు విజయ్ కోకాటేను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే మాణిక్రావ్ కోకటే.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయ సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Off The Record: 7 నియోజకవర్గాలు ఉండగా పిఠాపురం మీదే ఆ కలెక్టర్ ఫోకస్ ఎందుకు?
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
గృహనిర్మాణ పథకంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన 10 శాతం కోటాను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మంత్రి, ఆయన సోదరుడిని కోర్టు దోషులుగా తేల్చింది. నాసిక్ సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మహాయుతి కూటమి ప్రభుత్వంలో అలజడి చెలరేగింది. ఎన్సీపీ నేత, మాణిక్రావ్ కోకటే రాజీనామా చేయక తప్పలేదు.
ఇది కూడా చదవండి: ‘Akhanda 2’ 3D Show: అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో చూసిన బోయపాటి..
నాసిక్ సెషన్స్ కోర్టు గతంలో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను సమర్థించింది. న్యాయస్థానం శిక్ష నిర్ధారించడంతో మాణిక్రావ్ కోకాటే మహారాష్ట్ర శాసనసభ నుంచి అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల చట్టం ప్రకారం.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దోషిగా తేలితే ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోతే వెంటనే అనర్హతకు గురవుతారు.
కోకాటే రాజీనామా లేఖ ఇంకా ముఖ్యమంత్రి ఫడ్నవిస్కు అందలేదని వర్గాలు తెలిపాయి. అయితే మంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోకాటే రాజీనామాను ఫఢ్నవిస్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అజిత్ పవార్తో కూడా ఫడ్నవిస్ ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలో మాణిక్రావ్ కోకాటే మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతూ కెమెరాకు దొరికిపోయారు. అప్పట్లో ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం మాణిక్రావ్కు క్రీడాశాఖ కేటాయించారు.
తాజావార్తలు
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!