Maharashtra: మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా.. ఎన్సీపీలో రాజకీయ కలకలం
- రాజకీయ దుమారం రేపిన సర్పంచ్ హత్య కేసు
- మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో ధనంజయ్ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ధనంజయ్ ముండే రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. వెంటనే దేవేంద్ర ఫడ్నవిస్ ఆమోదించి.. గవర్నర్ రాధాకృష్ణన్కు పంపించారు.
ఇది కూడా చదవండి: Ayesha Khan : అదరహో అందాల ‘అయేషా’
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్ముఖ్ను కిడ్నాప్ చేసి అనంతరం చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. హంతకులు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తీసినట్లు సమాచారం. ఈ వీడియోల్లో సర్పంచ్ను అత్యంత క్రూరంగా హింసించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో కూటమి ప్రభుత్వం తలొగ్గింది. ఈ నేపథ్యంలో ధనంజయ్ రాజీనామా చేయక తప్పలేదు.
ఇది కూడా చదవండి: SLBC: రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
ధనంజయ్ ముండే.. బీడ్ పార్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధనంజయ్.. దివంగత గోపీనాథ్ ముండే మేనల్లుడు. ధనంజయ్ ముండే 2013లో ఎన్సీపీలో చేరారు. 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ విడిపోయినప్పుడు.. అజిత్ పవార్ పక్షాన చేరారు. గతంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!