Maharashtra: రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్.. ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
- రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్
- ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
- 5 శాతం కోటా పూర్తిగా రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజాన్ ప్రారంభ వేళ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ భారీ షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికింది. ముస్లింలకు కేటాయించే 5 శాతం కోటాను పూర్తిగా రద్దు చేసింది. పాత సర్క్యులర్లు, ఆదేశాలన్నింటినీ రద్దు చేసింది.
విద్యలో ముస్లిం సమాజానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ 2014 నుంచి అమలులోకి వచ్చింది. కానీ చట్టం లేకపోవడం, కోర్టు స్టేలు కారణంగా సంవత్సరాలుగా అనిశ్చితిలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ముస్లిం విద్యార్థులకు కళాశాలల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ కావు.
Also Read
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
- Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!
- SIR Explained: ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించారా? ఇకపై మీరు భారతీయులు కాదా?
ఇది కూడా చదవండి: US-Iran: అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం.. మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్
ప్రభుత్వ నిర్ణయంపై AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ తీవ్రంగా స్పందించారు. ‘‘రంజాన్ కానుకగా ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం విద్యా రిజర్వేషన్లను రద్దు చేసింది. ముస్లింలలో అత్యధిక డ్రాపౌట్ రేటు ఉందని హైకోర్టు అంగీకరించింది. అయినప్పటికీ మన అబ్బాయిలు, అమ్మాయిలు డ్రాప్ అవుట్ చేయవద్దని మేము చెబుతాము. భారతదేశం చదువుకుంటే.. భారతదేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకురాలు, ప్రొఫెసర్ వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ మండిపడ్డారు. ఇది ముస్లిం సమాజానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల హక్కులను ఎందుకు తొలగిస్తోంది? అని ఆమె ప్రశ్నించారు.
డిప్యూటీ సెక్రటరీ బదిలీ
ఇక మైనారిటీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ కూడా బదిలీ అయ్యారు. జనవరి 28-ఫిబ్రవరి 2, 2026 మధ్య రికార్డు సమయంలో 75కి పైగా విద్యాసంస్థలకు మైనారిటీ హోదా మంజూరు చేయబడిందని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత అనేక ఫైళ్లలో డిజిటల్ సంతకాలు నమోదు చేయబడ్డాయనే అనుమానాలు కూడా తలెత్తాయి. రాష్ట్ర సంతాప కాలంలో ఈ వేగవంతమైన ఆమోదాలు ఎలా జరిగాయనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం 75 ఆమోదాలను నిలిపివేసి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రూ.7,499కే IP64 రేటింగ్, Unisoc ప్రాసెసర్తో Lava Bold N2 లాంచ్.. ఫీచర్స్ ఇలా!
తాజావార్తలు
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!