Maharashtra: రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్.. ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
- రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్
- ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
- 5 శాతం కోటా పూర్తిగా రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజాన్ ప్రారంభ వేళ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ భారీ షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికింది. ముస్లింలకు కేటాయించే 5 శాతం కోటాను పూర్తిగా రద్దు చేసింది. పాత సర్క్యులర్లు, ఆదేశాలన్నింటినీ రద్దు చేసింది.
విద్యలో ముస్లిం సమాజానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ 2014 నుంచి అమలులోకి వచ్చింది. కానీ చట్టం లేకపోవడం, కోర్టు స్టేలు కారణంగా సంవత్సరాలుగా అనిశ్చితిలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ముస్లిం విద్యార్థులకు కళాశాలల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ కావు.
Also Read
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
ఇది కూడా చదవండి: US-Iran: అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం.. మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్
ప్రభుత్వ నిర్ణయంపై AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ తీవ్రంగా స్పందించారు. ‘‘రంజాన్ కానుకగా ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం విద్యా రిజర్వేషన్లను రద్దు చేసింది. ముస్లింలలో అత్యధిక డ్రాపౌట్ రేటు ఉందని హైకోర్టు అంగీకరించింది. అయినప్పటికీ మన అబ్బాయిలు, అమ్మాయిలు డ్రాప్ అవుట్ చేయవద్దని మేము చెబుతాము. భారతదేశం చదువుకుంటే.. భారతదేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకురాలు, ప్రొఫెసర్ వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ మండిపడ్డారు. ఇది ముస్లిం సమాజానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల హక్కులను ఎందుకు తొలగిస్తోంది? అని ఆమె ప్రశ్నించారు.
డిప్యూటీ సెక్రటరీ బదిలీ
ఇక మైనారిటీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ కూడా బదిలీ అయ్యారు. జనవరి 28-ఫిబ్రవరి 2, 2026 మధ్య రికార్డు సమయంలో 75కి పైగా విద్యాసంస్థలకు మైనారిటీ హోదా మంజూరు చేయబడిందని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత అనేక ఫైళ్లలో డిజిటల్ సంతకాలు నమోదు చేయబడ్డాయనే అనుమానాలు కూడా తలెత్తాయి. రాష్ట్ర సంతాప కాలంలో ఈ వేగవంతమైన ఆమోదాలు ఎలా జరిగాయనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం 75 ఆమోదాలను నిలిపివేసి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రూ.7,499కే IP64 రేటింగ్, Unisoc ప్రాసెసర్తో Lava Bold N2 లాంచ్.. ఫీచర్స్ ఇలా!
తాజావార్తలు
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్డే స్పెషల్గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
-
Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!