Maharashtra: రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్.. ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
- రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్
- ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
- 5 శాతం కోటా పూర్తిగా రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజాన్ ప్రారంభ వేళ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ భారీ షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికింది. ముస్లింలకు కేటాయించే 5 శాతం కోటాను పూర్తిగా రద్దు చేసింది. పాత సర్క్యులర్లు, ఆదేశాలన్నింటినీ రద్దు చేసింది.
విద్యలో ముస్లిం సమాజానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ 2014 నుంచి అమలులోకి వచ్చింది. కానీ చట్టం లేకపోవడం, కోర్టు స్టేలు కారణంగా సంవత్సరాలుగా అనిశ్చితిలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ముస్లిం విద్యార్థులకు కళాశాలల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ కావు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
ఇది కూడా చదవండి: US-Iran: అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం.. మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్
ప్రభుత్వ నిర్ణయంపై AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ తీవ్రంగా స్పందించారు. ‘‘రంజాన్ కానుకగా ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం విద్యా రిజర్వేషన్లను రద్దు చేసింది. ముస్లింలలో అత్యధిక డ్రాపౌట్ రేటు ఉందని హైకోర్టు అంగీకరించింది. అయినప్పటికీ మన అబ్బాయిలు, అమ్మాయిలు డ్రాప్ అవుట్ చేయవద్దని మేము చెబుతాము. భారతదేశం చదువుకుంటే.. భారతదేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకురాలు, ప్రొఫెసర్ వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ మండిపడ్డారు. ఇది ముస్లిం సమాజానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల హక్కులను ఎందుకు తొలగిస్తోంది? అని ఆమె ప్రశ్నించారు.
డిప్యూటీ సెక్రటరీ బదిలీ
ఇక మైనారిటీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ కూడా బదిలీ అయ్యారు. జనవరి 28-ఫిబ్రవరి 2, 2026 మధ్య రికార్డు సమయంలో 75కి పైగా విద్యాసంస్థలకు మైనారిటీ హోదా మంజూరు చేయబడిందని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత అనేక ఫైళ్లలో డిజిటల్ సంతకాలు నమోదు చేయబడ్డాయనే అనుమానాలు కూడా తలెత్తాయి. రాష్ట్ర సంతాప కాలంలో ఈ వేగవంతమైన ఆమోదాలు ఎలా జరిగాయనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం 75 ఆమోదాలను నిలిపివేసి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రూ.7,499కే IP64 రేటింగ్, Unisoc ప్రాసెసర్తో Lava Bold N2 లాంచ్.. ఫీచర్స్ ఇలా!
తాజావార్తలు
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..