Maha kumbh Mela 2025: నేటి నుంచి మహా కుంభమేళా షురూ..
- నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా..
- మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగా దాదాపు 13 వేల రైళ్లు..
- ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha kumbh Mela 2025: గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది. రాజ స్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.
Read Also: Manda Jagannatham : మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి… సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
Also Read
- Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
- TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
- Hypersonic Missiles: హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
ఇక, మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళాగా మార్చింది. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశామని.. 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
Read Also: Hero Ajith : రేసింగ్ లో దుమ్ములేపిన అజిత్.. దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
అలాగే, భక్తుల యొక్క భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 45,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు ఈ మహా కుంభ్ లో భాగం కానున్నాయి. ఆదివారం నాటికే లక్షల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చేశారు. శనివారం 25 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసుకోగా.. తెలుగుతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను ఉత్తర ప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..