Madhya Pradesh: అత్యాచార నిందితుడి ఇంటిని కూల్చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on a minor girl.. Bulldoze House Of Accused: మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఇటీవల ఓ కామాంధుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారాని పాల్పడ్డాడు. రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటనలకు పాల్పడిన గిర్రాజ్ రజాక్ అనే 35 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ అత్యాచారంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. దీంతో అధికారులు కూడా నిందితుడు రజాక్ పై చర్యలు చేట్టారు.
అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఇంటిని అధికారులు బుధవారం కూల్చేశారు. బాన్మోర్ పట్టణంలోని స్థానిక పౌర అధికారులు చట్టవిరుద్ధంగా ఉన్న నిందితుడి ఇంటిని కూల్చేశారు. మంగళవారం సాయంత్రం బాన్మోర్ పట్టణంలో ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాయ్ సింగ్ నర్వారియా తెలిపారు. బాలిక బయట కూర్చున్న సమయంలో నిందితుడు బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఏడుపులు విన్న తల్లి.. అక్కడికి చేరుకున్న సమయంలో నిందితుడు పారిపోయాడు. ఆ తరువాత నిందితుడిని కొంత దూరం వెంబడించినా దొరకలేదు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Uttar Pradesh: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి వైరల్ చేస్తామని బెదిరింపు
ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చర్యల్లో భాగంగా స్థానిక మున్సిపల్ అధికారులు నిందితుడి అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. బాలికను గ్వాలియర్ లోని ఆస్పత్రిలో చేర్చి అక్కడే చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు రాతి క్వారీలో కూలిగా పనిచేసేవాడని పోలీసులు వెల్లడించారు. అతనికి వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలపారు. గతేడాది కూడా నిందితుడు ఇలాంటి నేరానికే పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు రజాక్ ఇళ్లు పూర్తిగా చట్టవిరుద్ధంగా నిర్మించారని.. అందుకే ఇంటిని నేలమట్టం చేశామని మున్సిపల్ అధికారి యస్వర్ గోయల్ వెల్లడించారు. సెప్టెంబర్ 8న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మూడున్నరేళ్ల నర్సరీ చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే మొరేనాలో మరో ఘటన జరిగింది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..