Madhya Pradesh: అత్యాచార నిందితుడి ఇంటిని కూల్చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on a minor girl.. Bulldoze House Of Accused: మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఇటీవల ఓ కామాంధుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారాని పాల్పడ్డాడు. రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటనలకు పాల్పడిన గిర్రాజ్ రజాక్ అనే 35 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ అత్యాచారంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. దీంతో అధికారులు కూడా నిందితుడు రజాక్ పై చర్యలు చేట్టారు.
అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఇంటిని అధికారులు బుధవారం కూల్చేశారు. బాన్మోర్ పట్టణంలోని స్థానిక పౌర అధికారులు చట్టవిరుద్ధంగా ఉన్న నిందితుడి ఇంటిని కూల్చేశారు. మంగళవారం సాయంత్రం బాన్మోర్ పట్టణంలో ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాయ్ సింగ్ నర్వారియా తెలిపారు. బాలిక బయట కూర్చున్న సమయంలో నిందితుడు బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఏడుపులు విన్న తల్లి.. అక్కడికి చేరుకున్న సమయంలో నిందితుడు పారిపోయాడు. ఆ తరువాత నిందితుడిని కొంత దూరం వెంబడించినా దొరకలేదు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Uttar Pradesh: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి వైరల్ చేస్తామని బెదిరింపు
ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చర్యల్లో భాగంగా స్థానిక మున్సిపల్ అధికారులు నిందితుడి అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. బాలికను గ్వాలియర్ లోని ఆస్పత్రిలో చేర్చి అక్కడే చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు రాతి క్వారీలో కూలిగా పనిచేసేవాడని పోలీసులు వెల్లడించారు. అతనికి వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలపారు. గతేడాది కూడా నిందితుడు ఇలాంటి నేరానికే పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు రజాక్ ఇళ్లు పూర్తిగా చట్టవిరుద్ధంగా నిర్మించారని.. అందుకే ఇంటిని నేలమట్టం చేశామని మున్సిపల్ అధికారి యస్వర్ గోయల్ వెల్లడించారు. సెప్టెంబర్ 8న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మూడున్నరేళ్ల నర్సరీ చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే మొరేనాలో మరో ఘటన జరిగింది.
తాజావార్తలు
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!