Congress: బెంగాల్లో కాంగ్రెస్కి అవమానం.. ఖర్గే పోస్టర్లపై ఇంక్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తానని ఇటీవల బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. అయితే, ఆమె ప్రకటనపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె విధేయతను ప్రశ్నించడంతో పాటు ఆమెపై తనకు నమ్మకం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కాంగ్రెస్కి అవమానం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్న అనేక పోస్టర్లు, హోర్డింగులపై ఇంక్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లలో ఖర్గే ముఖానికి సిరా పూశారు. ‘‘తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్’’ అని రాశారు. ఈ ఘటనపై అధిర్ రంజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. దీనిపై ఫిర్యాదు నమోదైంది. ధ్వంసం చేసిన పోస్టర్లను తొలగించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Read Also: Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
శనివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఖర్గే, అధిర్ రంజర్ మధ్య విభేదాలు సృష్టించాలని టీఎంసీ ఇలా చేసి ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మమతపై అధిర్ రంజన్ విమర్శిలపై ఖర్గే స్పందిస్తూ.. ‘‘మమతా బెనర్జీ కూటమితోనే ఉన్నారు.. ప్రభుత్వంలో చేరతామని ఇటీవలే చెప్పారు. అధిర్ రంజన్ చౌదరి నిర్ణయం తీసుకోరు. నేనే, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటామని, అంగీకరించని వారు బయటకు వెళ్తారు.’’ అని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి తర్వాత కూటమిలో భాగం అవ్వాలా..? వద్దా..? అనేదానిపై అధిర్ రంజన్ నిర్ణయం తీసుకోరని ఆయన అన్నారు.
అంతకుముందు అధిర్ రంజన్, మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. బెంగాల్లో నన్ను, మా పార్టీని రాజకీయంగా అంతం చేయాలనుకునే వ్యక్తికి నేను అనుకూలంగా మాట్లాడలేను, ఇది ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కోసం పోరాటం, రాష్ట్ర కాంగ్రెస్ని ఆమె వ్యక్తిగత ఎజెండా కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఖర్గే నా అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే, రాష్ట్రంలోని అట్టడుగు స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కోసం నేను మాట్లాడుతుతాను అని అన్నారు. బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్-వామపక్షాలు పొత్తులో పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!