Congress: బెంగాల్లో కాంగ్రెస్కి అవమానం.. ఖర్గే పోస్టర్లపై ఇంక్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తానని ఇటీవల బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. అయితే, ఆమె ప్రకటనపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె విధేయతను ప్రశ్నించడంతో పాటు ఆమెపై తనకు నమ్మకం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కాంగ్రెస్కి అవమానం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్న అనేక పోస్టర్లు, హోర్డింగులపై ఇంక్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లలో ఖర్గే ముఖానికి సిరా పూశారు. ‘‘తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్’’ అని రాశారు. ఈ ఘటనపై అధిర్ రంజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. దీనిపై ఫిర్యాదు నమోదైంది. ధ్వంసం చేసిన పోస్టర్లను తొలగించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Read Also: Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
శనివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఖర్గే, అధిర్ రంజర్ మధ్య విభేదాలు సృష్టించాలని టీఎంసీ ఇలా చేసి ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మమతపై అధిర్ రంజన్ విమర్శిలపై ఖర్గే స్పందిస్తూ.. ‘‘మమతా బెనర్జీ కూటమితోనే ఉన్నారు.. ప్రభుత్వంలో చేరతామని ఇటీవలే చెప్పారు. అధిర్ రంజన్ చౌదరి నిర్ణయం తీసుకోరు. నేనే, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటామని, అంగీకరించని వారు బయటకు వెళ్తారు.’’ అని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి తర్వాత కూటమిలో భాగం అవ్వాలా..? వద్దా..? అనేదానిపై అధిర్ రంజన్ నిర్ణయం తీసుకోరని ఆయన అన్నారు.
అంతకుముందు అధిర్ రంజన్, మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. బెంగాల్లో నన్ను, మా పార్టీని రాజకీయంగా అంతం చేయాలనుకునే వ్యక్తికి నేను అనుకూలంగా మాట్లాడలేను, ఇది ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కోసం పోరాటం, రాష్ట్ర కాంగ్రెస్ని ఆమె వ్యక్తిగత ఎజెండా కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఖర్గే నా అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే, రాష్ట్రంలోని అట్టడుగు స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కోసం నేను మాట్లాడుతుతాను అని అన్నారు. బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్-వామపక్షాలు పొత్తులో పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?