UP: లక్నోలో దారుణం.. మహిళా ఉద్యోగినిపై లులు మాల్ మేనేజర్ అత్యాచారం
- లక్నోలో దారుణం
- మహిళా ఉద్యోగినిపై లులు మాల్ మేనేజర్ అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. లులు మాల్ మేనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. అనంతరం హోటల్కి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఇక బాధితురాలు జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: School Bus Fire Accident: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రఖ్యాత లులు మాల్ ఉంది. అందులో సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళా ఉద్యోగి పని చేస్తోంది. మాల్లో మేనేజర్గా ఉన్న 27 ఏళ్ల మహ్మద్ ఫర్హాజ్ ఆమెను ట్రాప్లో పడేశాడు. ఆమెను హోటల్కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. రహస్యంగా వీడియో తీసి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాడు. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన డిమాండ్లకు అంగీకరించకపోతే వీడియోను ఆన్లైన్లో పెడతానంటూ బెదిరించాడని వాపోయింది. గతంలో ఫర్హాజ్ అతడి ఇంటికి కూడా తీసుకెళ్లాడని.. అక్కడ తనపై దాడి చేసి సిగరెట్తో కాల్చాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Dhanush : ధనుష్ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే ఔట్..
నిందితుడిపై గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నంబర్ 608/25, BNS సెక్షన్లు 64, 123, 308, 115(2), 352, మరియు 351(3) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సౌత్ నిపున్ అగర్వాల్ తెలిపారు. కేసులో సమర్పించిన ఆధారాలు, వాదనలు, వస్తువులను ధృవీకరిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే గతంలో ఈ మాల్లో నమాజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో మతపరమైన స్థలంగా మార్చారంటూ హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. అనంతరం మాల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రార్థనలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. మాల్లో మత పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!