Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..
- తల్లిని అవమానించినందుకు 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం..
- తల్లిని కొట్టిన వ్యక్తిని గుర్తించి హత్య చేసిన కొడుకు..
- ఉత్తర్ ప్రదేశ్లో సినిమాను మించిన రివేంజ్ మర్డర్..
- చివరు ఓ మద్యం పార్టీ నిందితుల్ని పట్టించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avenge Murder: దశాబ్ధం క్రితం తన తల్లిని అవమానించి కొట్టిన వ్యక్తిని, ఆ తర్వాత కొడుకు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలాంటివి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఓ వ్యక్తి తల్లికి జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తిని లక్నో వీధుల్లో పదేళ్ల పాటు వెతికిన సోనూ కశ్యప్ కథ ఇది. హత్య తర్వాత పార్టీ ఇస్తానని చెప్పిన సోనూ, తన ఫ్రెండ్స్ని కూడా ఈ ప్లాన్లో చేర్చుకున్నాడు. కొబ్బరినీళ్లు అమ్ముకునే మనోజ్ని చంపిన కారణంగా నిందితులు సోనూ, రంజీత్, ఆదిల్, సలాం, రెహ్మత్ అలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Eternal Shares Jump: జొమాటో సంచలనం.. రెండు రోజుల్లో రూ. 52 వేల కోట్ల సంపాదన…
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
మనోజ్ సుమారు 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో సోనూ తల్లిని కొట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అప్పటి నుంచి అనుకుంటున్నాడు. మనోజ్ కోసం గత 10 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు. చివరకు మూడు నెలల క్రితం మనోజ్ని లక్నోలోని మున్షి పులియా ప్రాంతంలో చూశాడు. అప్పుడే హత్య చేయాలని ప్రణాళిక రెడీ చేశాడు. మనోజ్ రోజూవారీ షెడ్యూల్పై రెక్కీ నిర్వహించాడు. మే 22న, మనోజ్ తన దుకాణంలో ఒంటరిగా ఉండటం గమనించి, ఇనుప రాడ్లతో దాడి చేసి కొన ప్రాణాలతో వదిలేశారు. మనోజ్ చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసుల దర్యాప్తులో, నిందితులు ఎక్కడా కూడా సీసీ టీవీ కెమెరాల్లో కనిపించలేదు. దీంతో వారు నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అయితే, హత్య అమలు చేసిన తర్వాత తన స్నేహితులకు సోనూ పెద్ద ఎత్తున మద్యం పార్టీ ఇచ్చాడు. వీరంతా ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేశారు. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు వీరిని గుర్తించేందుకు సాయపడ్డాయి. నిందితులు ఐదుగురిలో ఒకరిని ఈ ఫోటోల సాయంతో పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఒక నిందితుడు ధరించిన ఆరెంజ్ కలర్ టీ షర్టు సాయంతో మొత్తం ఈ హత్యను ఛేదించారు.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!