Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..
- తల్లిని అవమానించినందుకు 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం..
- తల్లిని కొట్టిన వ్యక్తిని గుర్తించి హత్య చేసిన కొడుకు..
- ఉత్తర్ ప్రదేశ్లో సినిమాను మించిన రివేంజ్ మర్డర్..
- చివరు ఓ మద్యం పార్టీ నిందితుల్ని పట్టించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avenge Murder: దశాబ్ధం క్రితం తన తల్లిని అవమానించి కొట్టిన వ్యక్తిని, ఆ తర్వాత కొడుకు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలాంటివి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఓ వ్యక్తి తల్లికి జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తిని లక్నో వీధుల్లో పదేళ్ల పాటు వెతికిన సోనూ కశ్యప్ కథ ఇది. హత్య తర్వాత పార్టీ ఇస్తానని చెప్పిన సోనూ, తన ఫ్రెండ్స్ని కూడా ఈ ప్లాన్లో చేర్చుకున్నాడు. కొబ్బరినీళ్లు అమ్ముకునే మనోజ్ని చంపిన కారణంగా నిందితులు సోనూ, రంజీత్, ఆదిల్, సలాం, రెహ్మత్ అలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Eternal Shares Jump: జొమాటో సంచలనం.. రెండు రోజుల్లో రూ. 52 వేల కోట్ల సంపాదన…
Also Read
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
మనోజ్ సుమారు 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో సోనూ తల్లిని కొట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అప్పటి నుంచి అనుకుంటున్నాడు. మనోజ్ కోసం గత 10 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు. చివరకు మూడు నెలల క్రితం మనోజ్ని లక్నోలోని మున్షి పులియా ప్రాంతంలో చూశాడు. అప్పుడే హత్య చేయాలని ప్రణాళిక రెడీ చేశాడు. మనోజ్ రోజూవారీ షెడ్యూల్పై రెక్కీ నిర్వహించాడు. మే 22న, మనోజ్ తన దుకాణంలో ఒంటరిగా ఉండటం గమనించి, ఇనుప రాడ్లతో దాడి చేసి కొన ప్రాణాలతో వదిలేశారు. మనోజ్ చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసుల దర్యాప్తులో, నిందితులు ఎక్కడా కూడా సీసీ టీవీ కెమెరాల్లో కనిపించలేదు. దీంతో వారు నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అయితే, హత్య అమలు చేసిన తర్వాత తన స్నేహితులకు సోనూ పెద్ద ఎత్తున మద్యం పార్టీ ఇచ్చాడు. వీరంతా ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేశారు. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు వీరిని గుర్తించేందుకు సాయపడ్డాయి. నిందితులు ఐదుగురిలో ఒకరిని ఈ ఫోటోల సాయంతో పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఒక నిందితుడు ధరించిన ఆరెంజ్ కలర్ టీ షర్టు సాయంతో మొత్తం ఈ హత్యను ఛేదించారు.
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!