Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..
- తల్లిని అవమానించినందుకు 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం..
- తల్లిని కొట్టిన వ్యక్తిని గుర్తించి హత్య చేసిన కొడుకు..
- ఉత్తర్ ప్రదేశ్లో సినిమాను మించిన రివేంజ్ మర్డర్..
- చివరు ఓ మద్యం పార్టీ నిందితుల్ని పట్టించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avenge Murder: దశాబ్ధం క్రితం తన తల్లిని అవమానించి కొట్టిన వ్యక్తిని, ఆ తర్వాత కొడుకు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలాంటివి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఓ వ్యక్తి తల్లికి జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తిని లక్నో వీధుల్లో పదేళ్ల పాటు వెతికిన సోనూ కశ్యప్ కథ ఇది. హత్య తర్వాత పార్టీ ఇస్తానని చెప్పిన సోనూ, తన ఫ్రెండ్స్ని కూడా ఈ ప్లాన్లో చేర్చుకున్నాడు. కొబ్బరినీళ్లు అమ్ముకునే మనోజ్ని చంపిన కారణంగా నిందితులు సోనూ, రంజీత్, ఆదిల్, సలాం, రెహ్మత్ అలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Eternal Shares Jump: జొమాటో సంచలనం.. రెండు రోజుల్లో రూ. 52 వేల కోట్ల సంపాదన…
Also Read
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి బాధ్యులు వారే.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణపై భారత్ సీరియస్..
మనోజ్ సుమారు 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో సోనూ తల్లిని కొట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అప్పటి నుంచి అనుకుంటున్నాడు. మనోజ్ కోసం గత 10 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు. చివరకు మూడు నెలల క్రితం మనోజ్ని లక్నోలోని మున్షి పులియా ప్రాంతంలో చూశాడు. అప్పుడే హత్య చేయాలని ప్రణాళిక రెడీ చేశాడు. మనోజ్ రోజూవారీ షెడ్యూల్పై రెక్కీ నిర్వహించాడు. మే 22న, మనోజ్ తన దుకాణంలో ఒంటరిగా ఉండటం గమనించి, ఇనుప రాడ్లతో దాడి చేసి కొన ప్రాణాలతో వదిలేశారు. మనోజ్ చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసుల దర్యాప్తులో, నిందితులు ఎక్కడా కూడా సీసీ టీవీ కెమెరాల్లో కనిపించలేదు. దీంతో వారు నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అయితే, హత్య అమలు చేసిన తర్వాత తన స్నేహితులకు సోనూ పెద్ద ఎత్తున మద్యం పార్టీ ఇచ్చాడు. వీరంతా ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేశారు. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు వీరిని గుర్తించేందుకు సాయపడ్డాయి. నిందితులు ఐదుగురిలో ఒకరిని ఈ ఫోటోల సాయంతో పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఒక నిందితుడు ధరించిన ఆరెంజ్ కలర్ టీ షర్టు సాయంతో మొత్తం ఈ హత్యను ఛేదించారు.
తాజావార్తలు
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?