UP Crime: పొరుగింటి వారి తప్పుడు లైంగిక వేధింపుల కేసు.. 6 పేజీల నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య..
- తప్పుడు లైంగిక వేధింపుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య.. కుమార్తె పెళ్లి కాదనే భయం, పరువు పోతుందనే ఆందోళన..
- విషం తాగి తనువు చాలించిన బేకరీ యజమాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో బేకరీ యజమాని అయిన వీరేంద్ర యాదవ్ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలతో సమాజంలో పరువు పోవడం, తన కుమార్తె వివాహంపై ఆందోళనతో ఆయన ఈ తీవ్ర చర్య తీసుకున్నాడు. పొరుగింటి వారితో ర్యాంప్ నిర్మాణం గొడవతో ఈ వివాదం మొదలైంది.
లక్నోలోని మనక్ నగర్ ప్రాంతంలో బేకరీ నడుపుతున్న వీరేంద్ర యాదవ్, తన ఇంటి బయట ర్యాంప్ నిర్మించడంపై పొరుగువారైన సుర్జీత్ యాదవ్, అతడి భార్య అనితతో వివాదం ఏర్పడింది. వివాదం తీవ్రం కావడంతో ఈ కేసు కోర్టుకు చేరింది. అయితే, దానిని ఆపాలని కోర్టు ఆదేశించినప్పటికీ, వీరేంద్ర యాదవ్ ఇంటి ముందు సుర్జీత్ యాదవ్ నిర్మాణాన్ని కొనసాగించారు. వీరేంద్ర పలుమార్లు నిరసన తెలియజేసినప్పటికీ, ఆ కుటుంబం వినిపించుకోలేదు. దీంతో పాటు వారు వీరేంద్ర, అతడి కుటుంబంపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
Read Also: Illegal Sand Transportation: ఆంధ్రా నుంచి సత్తుపల్లి వరకూ జోరుగా అక్రమంగా ఇసుక రవాణా
మృతుడు వీరేంద్ర భార్య నీలం చెబుతున్న దాని ప్రకారం, తప్పుడు కేసులో సమన్లు అందుకున్న తర్వాత తన భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, తన కుటుంబం సమాజంలో గౌరవాన్ని కోల్పోతుందని భయపడ్డాడని, తన కుమార్తె వివాహం కాదేమో అని ఆందోళన చెందినట్లు చెప్పింది. తాను జైలుకు వెళ్తే తన కుమార్తెను ఎవరూ పెళ్లి చేసుకోరేమో అని, విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆధారాలు లేకుండా వీరేంద్రపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసినట్లు అతడి కుమారుడు అభయ్ ఆరోపించారు. సుర్జీత్, అనితా యాదవ్ ఇద్దరూ కూడా వీరేంద్ర కుటుంబాన్నే కాకుండా, పొరుగున ఉన్న మరో కుటుంబాన్ని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?