UP Crime: పొరుగింటి వారి తప్పుడు లైంగిక వేధింపుల కేసు.. 6 పేజీల నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య..
- తప్పుడు లైంగిక వేధింపుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య.. కుమార్తె పెళ్లి కాదనే భయం, పరువు పోతుందనే ఆందోళన..
- విషం తాగి తనువు చాలించిన బేకరీ యజమాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో బేకరీ యజమాని అయిన వీరేంద్ర యాదవ్ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలతో సమాజంలో పరువు పోవడం, తన కుమార్తె వివాహంపై ఆందోళనతో ఆయన ఈ తీవ్ర చర్య తీసుకున్నాడు. పొరుగింటి వారితో ర్యాంప్ నిర్మాణం గొడవతో ఈ వివాదం మొదలైంది.
లక్నోలోని మనక్ నగర్ ప్రాంతంలో బేకరీ నడుపుతున్న వీరేంద్ర యాదవ్, తన ఇంటి బయట ర్యాంప్ నిర్మించడంపై పొరుగువారైన సుర్జీత్ యాదవ్, అతడి భార్య అనితతో వివాదం ఏర్పడింది. వివాదం తీవ్రం కావడంతో ఈ కేసు కోర్టుకు చేరింది. అయితే, దానిని ఆపాలని కోర్టు ఆదేశించినప్పటికీ, వీరేంద్ర యాదవ్ ఇంటి ముందు సుర్జీత్ యాదవ్ నిర్మాణాన్ని కొనసాగించారు. వీరేంద్ర పలుమార్లు నిరసన తెలియజేసినప్పటికీ, ఆ కుటుంబం వినిపించుకోలేదు. దీంతో పాటు వారు వీరేంద్ర, అతడి కుటుంబంపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
Read Also: Illegal Sand Transportation: ఆంధ్రా నుంచి సత్తుపల్లి వరకూ జోరుగా అక్రమంగా ఇసుక రవాణా
మృతుడు వీరేంద్ర భార్య నీలం చెబుతున్న దాని ప్రకారం, తప్పుడు కేసులో సమన్లు అందుకున్న తర్వాత తన భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, తన కుటుంబం సమాజంలో గౌరవాన్ని కోల్పోతుందని భయపడ్డాడని, తన కుమార్తె వివాహం కాదేమో అని ఆందోళన చెందినట్లు చెప్పింది. తాను జైలుకు వెళ్తే తన కుమార్తెను ఎవరూ పెళ్లి చేసుకోరేమో అని, విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆధారాలు లేకుండా వీరేంద్రపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసినట్లు అతడి కుమారుడు అభయ్ ఆరోపించారు. సుర్జీత్, అనితా యాదవ్ ఇద్దరూ కూడా వీరేంద్ర కుటుంబాన్నే కాకుండా, పొరుగున ఉన్న మరో కుటుంబాన్ని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..