LPG Gas Price: భారీగా పెరిగిన గ్యాస్ ధర.. సిలిండర్పై రూ.105 పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.899.5 వద్ద స్థిరంగా ఉండగా.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మాత్రం రూ.105 పెంచారు.
Read Also: Russia-Ukraine War: దాడులు మరింత ఉధృతం
Also Read
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి.. వంట గ్యాస్ జోలికి పోకపోయినా.. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది. ధర పెరిగిన తర్వాత, న్యూఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,012గా మారింది. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇక, 5 కేజీల సిలిండర్ ధర కూడా రూ.27 పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో 5 కేజీల సిలిండర్ ధర రూ.569కి చేరింది.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లలో ఎలాంటి పెంపుదల లేదు. కాగా, ఎల్పీజీ సిలిండర్ ధర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతి నెల సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. గత నెలలో అంటే ఫిబ్రవరి 2022లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 91.50 తగ్గగా.. ఇప్పులు మళ్లీ వడ్డించారు.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.105 పెరిగి రూ.1,907 నుంచి రూ.2,012కి చేరగా.. . కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.108 పెరిగి రూ.2,095కి చేరుకుంది. ఇంతకు ముందు దీని ధర రూ.1,987గా ఉంది. మరోవైపు ముంబైలో రూ.1963కి చేరింది వాణిజ్య గ్యాస్ ధర… గతంలో ఇది రూ.1857 ఉండగా.. ఇప్పుడు రూ.106 పెరిగింది. అదే సమయంలో చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2145.5కి పెరిగింది. ఇక్కడ రూ.65 వడ్డించారు.. ఇంతకు ముందు ధర రూ.2080.5.గా ఉంది..
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..