LPG Gas Price: భారీగా పెరిగిన గ్యాస్ ధర.. సిలిండర్పై రూ.105 పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.899.5 వద్ద స్థిరంగా ఉండగా.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మాత్రం రూ.105 పెంచారు.
Read Also: Russia-Ukraine War: దాడులు మరింత ఉధృతం
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి.. వంట గ్యాస్ జోలికి పోకపోయినా.. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది. ధర పెరిగిన తర్వాత, న్యూఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,012గా మారింది. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇక, 5 కేజీల సిలిండర్ ధర కూడా రూ.27 పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో 5 కేజీల సిలిండర్ ధర రూ.569కి చేరింది.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లలో ఎలాంటి పెంపుదల లేదు. కాగా, ఎల్పీజీ సిలిండర్ ధర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతి నెల సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. గత నెలలో అంటే ఫిబ్రవరి 2022లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 91.50 తగ్గగా.. ఇప్పులు మళ్లీ వడ్డించారు.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.105 పెరిగి రూ.1,907 నుంచి రూ.2,012కి చేరగా.. . కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.108 పెరిగి రూ.2,095కి చేరుకుంది. ఇంతకు ముందు దీని ధర రూ.1,987గా ఉంది. మరోవైపు ముంబైలో రూ.1963కి చేరింది వాణిజ్య గ్యాస్ ధర… గతంలో ఇది రూ.1857 ఉండగా.. ఇప్పుడు రూ.106 పెరిగింది. అదే సమయంలో చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2145.5కి పెరిగింది. ఇక్కడ రూ.65 వడ్డించారు.. ఇంతకు ముందు ధర రూ.2080.5.గా ఉంది..
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!