Flower Farming: పూల సాగుతో లాభాలెన్నో.. తక్కువ శ్రమ, ఎక్కువ డబ్బులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటల కంటే పూల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. కొందరు బంతిపూల సాగు చేస్తుండగా.. మరికొందరు గులాబీ, చంపా, మల్లె, పొద్దుతిరుగుడు పూల సాగు చేస్తున్నారు. ఈ పూల సాగు ప్రారంభించిన అనతికాలంలోనే పాలము రైతుల జీవితాలు మారినట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా వారి ఆదాయం గతంలో కంటే మెరుగ్గా అయిందని అంటున్నారు. అంతేకాకుండా పూలను సాగు చేయడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.
Supreme Court: మణిపూర్ అల్లర్లపై తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
పాలము జిల్లాలోని గర్వా మరియు లతేహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. ఈ రైతులు పండించిన పూలను పాలమూళ్లలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులకు గుర్తింపు వచ్చింది. మరోవైపు అక్కడి ప్రాంతంలోని 459 మంది రైతులకు పూల సాగు కోసం ఉద్యానవన శాఖ మొక్కలు పంపిణీ చేసింది. పాలములోని బసరియా కాల, సాలాతువా, కంకారి, బందువ పంచాయతీల్లో 130 మంది రైతులు పూల సాగు చేస్తున్నారు. ఈ రైతుల్లో మహిళల సంఖ్య కూడా బాగానే ఉంది. కొందరు మహిళా రైతులు చిన్న చిన్న పాచెస్లో పూలను పెంచుతున్నారు. దీంతో మహిళా రైతుల భవితవ్యం మారిపోయింది.
Adani-Hindenburg Case: అదానీ-హిండెన్బర్గ్ కేసు.. సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్ దాఖలు
అంతేకాకుండా లాతేహార్లో 20 హెక్టార్లలో రైతులు పూల సాగు చేస్తున్నారు. దాదాపు 20 మంది రైతులు మేరిగోల్డ్, గ్లాడియోలస్ పూలను పండిస్తున్నారు. దీంతో రైతులకు ఏడాదిలో లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మరోవైపు చైన్పూర్ బ్లాక్లో 99 మంది రైతులకు బంతిపూలు, జెర్బెరా, గ్లాడియోలస్ మొక్కలను సాగుకు ఇచ్చామని పాలము ఉద్యానశాఖ అధికారి శైలేంద్రకుమార్ చెబుతున్నారు. ఈ పూల సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తోంది. పూల సాగులో రైతులను ప్రోత్సహిస్తున్నామని, తద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పొంది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!