Flower Farming: పూల సాగుతో లాభాలెన్నో.. తక్కువ శ్రమ, ఎక్కువ డబ్బులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటల కంటే పూల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. కొందరు బంతిపూల సాగు చేస్తుండగా.. మరికొందరు గులాబీ, చంపా, మల్లె, పొద్దుతిరుగుడు పూల సాగు చేస్తున్నారు. ఈ పూల సాగు ప్రారంభించిన అనతికాలంలోనే పాలము రైతుల జీవితాలు మారినట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా వారి ఆదాయం గతంలో కంటే మెరుగ్గా అయిందని అంటున్నారు. అంతేకాకుండా పూలను సాగు చేయడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.
Supreme Court: మణిపూర్ అల్లర్లపై తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది..
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
పాలము జిల్లాలోని గర్వా మరియు లతేహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. ఈ రైతులు పండించిన పూలను పాలమూళ్లలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులకు గుర్తింపు వచ్చింది. మరోవైపు అక్కడి ప్రాంతంలోని 459 మంది రైతులకు పూల సాగు కోసం ఉద్యానవన శాఖ మొక్కలు పంపిణీ చేసింది. పాలములోని బసరియా కాల, సాలాతువా, కంకారి, బందువ పంచాయతీల్లో 130 మంది రైతులు పూల సాగు చేస్తున్నారు. ఈ రైతుల్లో మహిళల సంఖ్య కూడా బాగానే ఉంది. కొందరు మహిళా రైతులు చిన్న చిన్న పాచెస్లో పూలను పెంచుతున్నారు. దీంతో మహిళా రైతుల భవితవ్యం మారిపోయింది.
Adani-Hindenburg Case: అదానీ-హిండెన్బర్గ్ కేసు.. సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్ దాఖలు
అంతేకాకుండా లాతేహార్లో 20 హెక్టార్లలో రైతులు పూల సాగు చేస్తున్నారు. దాదాపు 20 మంది రైతులు మేరిగోల్డ్, గ్లాడియోలస్ పూలను పండిస్తున్నారు. దీంతో రైతులకు ఏడాదిలో లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మరోవైపు చైన్పూర్ బ్లాక్లో 99 మంది రైతులకు బంతిపూలు, జెర్బెరా, గ్లాడియోలస్ మొక్కలను సాగుకు ఇచ్చామని పాలము ఉద్యానశాఖ అధికారి శైలేంద్రకుమార్ చెబుతున్నారు. ఈ పూల సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తోంది. పూల సాగులో రైతులను ప్రోత్సహిస్తున్నామని, తద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పొంది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!