PM Modi: ‘‘ మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం’’.. నాలుగో దశ ఓటింగ్ ముందు పీఎం సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాలుగో దశ పోలింగ్కి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓటర్ల సందేశమిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడాని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని పీఎం మోడీ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ సహా అన్ని ప్రాంతాల్లో ఓటేసేందుకు ఓటర్లు రికార్డు సంఖ్యలో పోలింగ్ సెంటర్లకు చేరుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
‘‘ఈరోజు 4వ దశ లోక్సభ ఎన్నికలలో, 10 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో మరియు యువ ఓటర్లు కూడా ఓటు వేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మహిళా ఓటర్లు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. కాబట్టి రండి, మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్ధాం’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
‘‘ నాలుగో దశ లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఓటర్లు రికార్డు స్థాయిలో పోలింగ్ బూత్లకు చేరుకుని వారసత్వాన్ని గౌరవించే ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నక్సలిజాన్ని రూపుమాపడమే వారి సంకల్పం మరియు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మీ ప్రతి ఓటు సుస్థిరమైన, దృఢమైన మరియు నిర్ణయాత్మక ప్రభుత్వానికి బలమైన స్తంభంలా పనిచేస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17, ఉత్తరప్రదేశ్ నుంచి 13, మహారాష్ట్ర నుంచి 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిది, బీహార్ నుంచి 5, జార్ఖండ్, ఒడిశా నుంచి నాలుగు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకటి ఉన్నాయి. ఈ దశ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, బీజేపీ నేతుల గిరిరాజ్ సింగ్ చౌహాన్, శత్రఘ్ను సిన్హా, యూసప్ పఠాన్, వైఎస్ షర్మిలా వంటి ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు.
ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి…
— Narendra Modi (@narendramodi) May 13, 2024
తాజావార్తలు
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!