Jaya Bachchan: నదిలోకి శవాలు, కుంభమేళా నీరు అత్యంత కలుషితం: ఎస్పీ ఎంపీ జయా బచ్చన్..
- కుంభమేళా నీరు అత్యంత కలుషితం..
- తొక్కిసలాటలో మరణించి వారి మృతదేశాలు నదిలోకి..
- యూపీ సర్కార్పై ఆరోపణలు గుప్పించిన ఎస్పీ ఎంపీ జయాబచ్చన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaya Bachchan: మహ కుంభమేళాపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాలోని గంగా, యమునా నదుల్లోని నీరు కలుషితమైందని ఆమె సోమవారం ఆరోపించారు. గత నెలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందుకు, నదిలోని నీరు కలుషితమైందని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సామాన్య ప్రజల కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. ‘‘ ప్రస్తుతం ఎక్కడ నీరు కలుషితమైందంటే, అది మహా కుంభమేళాలో ఉంది. తొక్కిసలాటలో మరణించిన మృతదేహాలను నదిలో పారేయడం వల్ల నీరు కలుషితమైంది. అసలు సమస్యని పరిష్కరించడం లేదు. కుంభ్కి వచ్చే సామాన్య ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. వారి కోసం ఏర్పాట్లు చేయలేదు’’ అని పార్లమెంట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
Read Also: Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్చల్.. యమునా నీళ్లతో నిరసన
మృతదేహాలకు పోస్టుమార్టం జరలేదు, జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణిస్తే, 60 మంది గాయపడ్డారు. కంటితుడుపు చర్యలకే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు. బీజేపీ వారు నీరు, జలశక్తి గురించి ప్రసంగాలు చేస్తున్నారు, కోట్లాడి మంది ప్రజలు ఆ ప్రదేశాన్ని సందర్శించాలని అబద్ధాలు చెబుతున్నారని, ఆ ప్రదేశంలో అంతపెద్ద సంఖ్యలో ప్రజలు ఎలా గుమిగూడగరు..? అని ప్రశ్నించారు.
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం మృతుల సంఖ్యని దాచిపెడుతోందని ఎస్పీతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేశాయి. జనవరి 29న తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో లక్షలాది మంది భక్తులు సంగమ ప్రాంతం వద్దకు చేరడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిపై యూపీ ప్రభుత్వం జ్యుడిషీయల్ ఎంక్వైరీకి ఆదేశించింది.
#WATCH | Delhi: Samajwadi Party MP Jaya Bachchan says, "… Where is the water most contaminated right now? It's in Kumbh. Bodies (of those who died in the stampede) have been thrown in the river because of which the water has been contaminated… The real issues are not being… pic.twitter.com/9EWM2OUCJj
— ANI (@ANI) February 3, 2025
తాజావార్తలు
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!