Kolkata Doctor Rape and Murder Case: జూనియర్ డాక్టర్ పై దాడికి ముందు రెడ్లైట్ ఏరియాలకు నిందితుడు..!
- కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో మరో మలుపు..
- రాత్రి సమయంలో రెండు వ్యభిచార గృహాలను సందర్శించిన నిందితుడు సంజయ్ రాయ్..
- ఈ కేసులో నిందితుడితో పాటు మాజీ ప్రిన్సిపాల్.. ఎస్ఐ అనుప్ దత్తాను ప్రశ్నిస్తునన్న సీబీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Rape and Murder Case: కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి పాల్పడే ముందు కోల్కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్కతా పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సమయంలో అప్పటికే మద్యం తాగిన రాయ్.. ఆసుపత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని ‘రెడ్ లైట్ ఏరియా’లకు వెళ్లాడని.. వీరిద్దరు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని రెంట్ కు తీసుకొని.. తొలుత సోనాగచికి అర్ధరాత్రి టైంలో వెళ్లారు.. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలబడగా.. అతడి మిత్రుడు లోపలికి వెళ్లి వచ్చాడు.. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను సంజయ్ రాయ్ వేధింపులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. ఆమె నగ్న చిత్రాలు కావాలంటూ వేధించాడు.
Read Also: Jio TV+: ఇకపై ఎలాంటి సెటప్ బాక్స్ అవసరం లేకుండానే 800 డిజిటల్ ఛానెల్స్.. ఎలా అంటే.?
Also Read
ఇక, ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్జీ కార్ ఆసుపత్రికి చేరుకున్న సంజయ్ రాయ్.. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ను పగలగొట్టాడు.. 4.03 గంటల టైంలో ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాడు.. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాగా.. అక్కడే బాధితురాలు గాఢ నిద్రలో ఉండటంతో ఆమెపై సంజయ్ రాయ్ దాడికి పాల్పడ్డాడు అని కోల్కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆర్జీ కార్ ఆసుపత్రి వెనక వైపు వెళ్లి రాయ్ మద్యం తాగినట్లు పలువురు వెల్లడించారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలు చూసినట్లు కూడా చెప్పుకొచ్చారు. మద్యం తాగిన తర్వాత పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
Read Also: Huge Fire Accident: తెల్లవారుజామున దుకాణాల్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
కాగా, సెమినార్ హాలులో బాధితురాలు చనిపోయిన విషయం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న 10.53 నిమిషాలకు బాధితురాలి తల్లికి విషయం తెలిపారు. ఫస్ట్ బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు హస్పటల్ సిబ్బంది చెప్పాగా.. ఆ తర్వాత ఇది హత్యగా తేలింది. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు. తొలుత కేసు నమోదు చేసిన ఎస్సై అనుప్ దత్తాను సీబీఐ ప్రశ్నించింది. ఎస్సైతో కలిసి నిందితుడు సంజయ్ రాయ్ దిగిన పలు ఫొటోలను దర్యాప్తు సంస్థ సేకరించింది.
తాజావార్తలు
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!