Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- కోల్కతా ఎయిర్ పోర్టు తరలింపుపై మళ్లీ చర్చ..
- బీజేపీ ప్రభుత్వం రాకతో తరలిస్తారే ప్రచారం..
- 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బంక్రా మసీద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Airport Mosque: కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ పాలకుడు మాత్రం ఓట్ల వేటలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మసీదుపై మరోసారి చర్చ మొదలైంది.
‘‘గౌరీపసూర్ జామే మస్జిద్’’ లేదా ‘‘బంక్రా మసీదు’’గా పిలిచే ఈ మసీదు ఏయిర్పోర్టు రన్ వే పక్కనే ఉంది. దీంతో ఇది భద్రతా పరమైన ఆందోళనల్ని పెంచుతోంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ జోన్లోనే ఈ మసీదు ఉంది. సెకండ్ రన్వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. నియమాల ప్రకారం కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. దీని కారణంగా విమానాలు దిగే టచ్ డౌన్ పాయింట్ను 88 మీటర్లకు మార్చాలి వచ్చింది. పెద్ద విమానాలు ల్యాండ్ కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
- Saayoni Ghosh: 17 ఏళ్లకే హీరోయిన్గా.. అనతికాలంలో ఎంపీగా.. ట్రెండింగ్గా మారిన సయానీ ఘోష్ కథేంటి?
పశ్చిమ బెంగాల్లో పాలన చేపట్టిన ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఈ మసీదు జోలికి వెళ్లలేదు. సీపీఎం ప్రభుత్వం ఉన్న సమయంలో జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్జి, టీఎంసీ ప్రభుత్వ సమయంలో సీఎం మమతా బెనర్జీలు ఈ మసీదును తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే, ప్రస్తుతం సీఎం సువేందు అధికారి ఉండటంతో ఈ ప్రార్థనా మందిరం మార్పు తప్పక ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా(ఏఏఐ) అధికారులు మసీదు వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం మసీదు కమిటీ సభ్యులతో మసీదు తరలింపుపై చర్చించారు.
మే 28 బక్రీద్ వరకు మసీదు తరలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని జిల్లా అధికారులు, ఎయిర్ పోర్టు అధికారులు నిర్ణయించారు. ఈద్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం రోజుకు 10 నుంచి 25 మంది వరకు నమాజ్ చేసుకునేందుకు ఆ మసీదుకు వెళ్తున్నారు. శుక్రవారం రోజు ఈ సంఖ్య 80కి చేరుతుంది. సీఐఎస్ఎఫ్ కఠినమైన భద్రతా తనిఖీలు, ఐడీ కార్డ్ చెక్ చేసిన తర్వాతనే ప్రార్థన చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!