Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- కోల్కతా ఎయిర్ పోర్టు తరలింపుపై మళ్లీ చర్చ..
- బీజేపీ ప్రభుత్వం రాకతో తరలిస్తారే ప్రచారం..
- 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బంక్రా మసీద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Airport Mosque: కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ పాలకుడు మాత్రం ఓట్ల వేటలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మసీదుపై మరోసారి చర్చ మొదలైంది.
‘‘గౌరీపసూర్ జామే మస్జిద్’’ లేదా ‘‘బంక్రా మసీదు’’గా పిలిచే ఈ మసీదు ఏయిర్పోర్టు రన్ వే పక్కనే ఉంది. దీంతో ఇది భద్రతా పరమైన ఆందోళనల్ని పెంచుతోంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ జోన్లోనే ఈ మసీదు ఉంది. సెకండ్ రన్వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. నియమాల ప్రకారం కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. దీని కారణంగా విమానాలు దిగే టచ్ డౌన్ పాయింట్ను 88 మీటర్లకు మార్చాలి వచ్చింది. పెద్ద విమానాలు ల్యాండ్ కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
పశ్చిమ బెంగాల్లో పాలన చేపట్టిన ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఈ మసీదు జోలికి వెళ్లలేదు. సీపీఎం ప్రభుత్వం ఉన్న సమయంలో జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్జి, టీఎంసీ ప్రభుత్వ సమయంలో సీఎం మమతా బెనర్జీలు ఈ మసీదును తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే, ప్రస్తుతం సీఎం సువేందు అధికారి ఉండటంతో ఈ ప్రార్థనా మందిరం మార్పు తప్పక ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా(ఏఏఐ) అధికారులు మసీదు వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం మసీదు కమిటీ సభ్యులతో మసీదు తరలింపుపై చర్చించారు.
మే 28 బక్రీద్ వరకు మసీదు తరలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని జిల్లా అధికారులు, ఎయిర్ పోర్టు అధికారులు నిర్ణయించారు. ఈద్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం రోజుకు 10 నుంచి 25 మంది వరకు నమాజ్ చేసుకునేందుకు ఆ మసీదుకు వెళ్తున్నారు. శుక్రవారం రోజు ఈ సంఖ్య 80కి చేరుతుంది. సీఐఎస్ఎఫ్ కఠినమైన భద్రతా తనిఖీలు, ఐడీ కార్డ్ చెక్ చేసిన తర్వాతనే ప్రార్థన చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.
తాజావార్తలు
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
-
Sports Injuries : జిమ్కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
-
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?