Arunachal Pradesh: వరదలు బీభత్సం.. ప్రమాదకర వీడియో విడుదల చేసిన కిరణ్ రిజిజు
- అరుణాచల్ప్రదేశ్లో వరదలు బీభత్సం
- ప్రమాదకర వీడియో విడుదల చేసిన కిరణ్ రిజిజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రాలు గత 48 గంటలుగా కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు 30 మంది వరకు చనిపోయారు. ఇక లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!
Also Read
అయితే భారీ వర్షాలు కారణంగా అరుణాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఒక వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో వేలాడే వంతెనపై ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిర్ రిజిజు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలా ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దయచేసి జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి రాసుకొచ్చారు. చైనా-మయన్మార్ సరిహద్దుల ట్రై-జంక్షన్ సమీపంలో అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Mrunal Thakur: ఇంత పిసినారి హీరోయిన్ని ఎక్కడ చూసి ఉండరు..
ఈ వంతెన వెదురు, తాడు, చెక్క పలకలతో తయారు చేయబడినట్లు కనిపిస్తోంది, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీటిలో చాలా వరకు కొట్టుకుపోయాయి. ఇదొక్కటే ఉండడంతో ప్రమాదకరంగా ప్రయాణం చేశాడు. ఒకవేళ తెగిపోతే ప్రాణాలు పోయినట్లే.
ఇక వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి పెమా ఖండు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఖండు కోరారు. ప్రస్తుతానికి నదులు మరియు నీటి వనరులలోకి దిగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj
— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!