King Cobra: ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ‘‘కింగ్ కోబ్రా’’ పాములు.. శాస్త్రవేత్తల్లో కలవరం..
- ఎవరెస్ట్ శిఖరం సమీపంలో కింగ్ కోబ్రా పాములు..
- శాస్త్రవేత్తల్లో పెరుగుతున్న ఆందోళనలు..
- వాతావరణ మార్పుల కారణమని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. గూడును నిర్మించుకునే ఈ పాము లక్షణం, దీనిని ఇతర పాముల నుంచి వేరు చేస్తుంది. దీని విషం అత్యంత శక్తివంతమైంది. ఒక్క కాటులో విడుదల చేసే విషంతో ఏకంగా 20 మందిని లేదా పెద్ద ఏనుగును చంపేంత శక్తి ఉంటుంది.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
Read Also: Gangster Goldy Brar: “సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్స్టర్..
కింగ్ కోబ్రాస్ మరియు మోనోక్లెడ్ కోబ్రాస్, రెండూ పాములు, దక్షిణ నేపాల్, ఉత్తర భారతదేశంలోని తారై రీజియన్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటంతో, ఇవి ఇప్పుడు కొండ, పర్వత ప్రాంతాల్లో గూళ్లు కట్టుకుని కనిపిస్తు్న్నాయి. శీతల ప్రాంతంలో ఈ పాములు ఉండటం వాతావరణ మార్పుల వల్ల కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారనంగా ఈ ఉష్ణమండల పాములు చల్లని ప్రాంతాలకు వెళ్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే, అతి ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
గత కొన్ని ఏళ్లుగా నేపాల్ వాతావరణ మార్పులను చూస్తోంది. నేపాల్ గరిష్ట ఉష్ణోగ్రత ఏడాదికి 0.05 డిగ్రీ సెల్సియన్ చొప్పున పెరుగుతోంది. నివాస విధ్వంసం, మానవ సంఘర్షణ, పాము కాట్లు కింగ్ కోబ్రాలకు గణనీయ ముప్పుని కలిగిస్తున్నాయి. ముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక అయిన ది లాన్సెట్లో మార్చి 2022లో ప్రచురించబడిన ఒక నివేదికలో వేసవిలో తరై జిల్లాల్లో పాముకాటు ఫలితంగా మరణాలు సర్వసాధారణమని హైలైట్ చేసింది. ప్రతి సంవత్సరం, నేపాల్లోని తరై ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది, ఎక్కువగా పిల్లలు మరియు మహిళలు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!