King Cobra: ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ‘‘కింగ్ కోబ్రా’’ పాములు.. శాస్త్రవేత్తల్లో కలవరం..
- ఎవరెస్ట్ శిఖరం సమీపంలో కింగ్ కోబ్రా పాములు..
- శాస్త్రవేత్తల్లో పెరుగుతున్న ఆందోళనలు..
- వాతావరణ మార్పుల కారణమని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. గూడును నిర్మించుకునే ఈ పాము లక్షణం, దీనిని ఇతర పాముల నుంచి వేరు చేస్తుంది. దీని విషం అత్యంత శక్తివంతమైంది. ఒక్క కాటులో విడుదల చేసే విషంతో ఏకంగా 20 మందిని లేదా పెద్ద ఏనుగును చంపేంత శక్తి ఉంటుంది.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: Gangster Goldy Brar: “సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్స్టర్..
కింగ్ కోబ్రాస్ మరియు మోనోక్లెడ్ కోబ్రాస్, రెండూ పాములు, దక్షిణ నేపాల్, ఉత్తర భారతదేశంలోని తారై రీజియన్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటంతో, ఇవి ఇప్పుడు కొండ, పర్వత ప్రాంతాల్లో గూళ్లు కట్టుకుని కనిపిస్తు్న్నాయి. శీతల ప్రాంతంలో ఈ పాములు ఉండటం వాతావరణ మార్పుల వల్ల కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారనంగా ఈ ఉష్ణమండల పాములు చల్లని ప్రాంతాలకు వెళ్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే, అతి ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
గత కొన్ని ఏళ్లుగా నేపాల్ వాతావరణ మార్పులను చూస్తోంది. నేపాల్ గరిష్ట ఉష్ణోగ్రత ఏడాదికి 0.05 డిగ్రీ సెల్సియన్ చొప్పున పెరుగుతోంది. నివాస విధ్వంసం, మానవ సంఘర్షణ, పాము కాట్లు కింగ్ కోబ్రాలకు గణనీయ ముప్పుని కలిగిస్తున్నాయి. ముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక అయిన ది లాన్సెట్లో మార్చి 2022లో ప్రచురించబడిన ఒక నివేదికలో వేసవిలో తరై జిల్లాల్లో పాముకాటు ఫలితంగా మరణాలు సర్వసాధారణమని హైలైట్ చేసింది. ప్రతి సంవత్సరం, నేపాల్లోని తరై ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది, ఎక్కువగా పిల్లలు మరియు మహిళలు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..